ETV Bharat / city

'270కి పైగా పంచాయతీల్లో పదవులు దక్కాయి'

author img

By

Published : Feb 19, 2021, 8:28 AM IST

Updated : Feb 27, 2021, 12:56 PM IST

గ్రామ పంచాయతీ ఎన్నికల పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశాడు. 270 స్థానాల్లో గెలవడం సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు. ఇదే ఉత్సాహాన్ని నాలుగోదశ ఎన్నికలలో చూపించాలని కోరారు.

pawankalyan on third phase elections
pawankalyan on third phase elections
మూడోదశ ఫలితాలపై పవన్ కల్యాణ్ సమావేశం

గ్రామపంచాయతీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగేలా జనసేన కృషి చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తెలిపారు. మూడో విడతలో జనసేన దాదాపు 23శాతం ఓటింగ్‌ శాతం సాధించి 270కి పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కించుకుందని చెప్పారు. ఇది మార్పునకు సంకేతమని అభిప్రాయపడ్డారు. మైసూరువారిపల్లి పంచాయతీ సర్పంచ్‌గా దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుని భార్య సంయుక్త గెలుపొందడం చాలా ఆనందాన్ని కలిగించిందిన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు ఎదురొడ్డి నిలిచిన యువత, ఆడపడుచులు... నాలుగో విడతలోనూ అదే స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.

కుప్పం నియోజకవర్గంలో పంచాయతీలు, వార్డులను జనసైనికులు గెలవడం మార్పునకు సంకేతమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లుగా జనసైనికుల గెలుపొందారన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే మార్పు వస్తుందనే నమ్మకం చాలా బలంగా కలిగిందని తెలిపారు.

ఇదీ చూడండి. స్టేషన్ బెయిల్​పై చింతమనేని ప్రభాకర్ విడుదల

మూడోదశ ఫలితాలపై పవన్ కల్యాణ్ సమావేశం

గ్రామపంచాయతీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగేలా జనసేన కృషి చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తెలిపారు. మూడో విడతలో జనసేన దాదాపు 23శాతం ఓటింగ్‌ శాతం సాధించి 270కి పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కించుకుందని చెప్పారు. ఇది మార్పునకు సంకేతమని అభిప్రాయపడ్డారు. మైసూరువారిపల్లి పంచాయతీ సర్పంచ్‌గా దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుని భార్య సంయుక్త గెలుపొందడం చాలా ఆనందాన్ని కలిగించిందిన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు ఎదురొడ్డి నిలిచిన యువత, ఆడపడుచులు... నాలుగో విడతలోనూ అదే స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.

కుప్పం నియోజకవర్గంలో పంచాయతీలు, వార్డులను జనసైనికులు గెలవడం మార్పునకు సంకేతమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లుగా జనసైనికుల గెలుపొందారన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే మార్పు వస్తుందనే నమ్మకం చాలా బలంగా కలిగిందని తెలిపారు.

ఇదీ చూడండి. స్టేషన్ బెయిల్​పై చింతమనేని ప్రభాకర్ విడుదల

Last Updated : Feb 27, 2021, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.