ETV Bharat / city

పోలీస్‌ అభ్యర్థులకు అలెర్ట్.. నెగెటివ్​ మార్కులు ఉన్నాయి జాగ్రత్త..!

author img

By

Published : Jul 8, 2022, 12:18 PM IST

వేలల్లో పోస్టులు.. లక్షల్లో అభ్యర్థులు.. ఒక్కో పోస్టుకు వందల్లో పోటీదారులు.. పోలీస్‌ నియామక ప్రక్రియలో నెలకొన్న తాజా పరిణామమిది. తెలంగాణ పోలీస్‌శాఖలో భారీ నోటిఫికేషన్‌లో భాగంగా పోలీసుల ఎంపికకు ప్రాథమిక రాతపరీక్ష (పీడబ్ల్యూటీ)కు నియామక మండలి తేదీలు ఖరారు చేయడంతో అభ్యర్థులు సన్నద్ధతలో వేగం పెంచారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి తప్పుడు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులు వేయనుండటంతో వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

పోలీస్‌ అభ్యర్థులకు అలెర్ట్..
పోలీస్‌ అభ్యర్థులకు అలెర్ట్..

పోలీస్​ ప్రాథమిక రాతపరీక్ష అర్హతలో ఈసారి మార్పులు చేశారు. 2018 నోటిఫికేషన్‌ సమయంలో పీడబ్ల్యూటీలో అర్హత పొందేందుకు కేటగిరీల వారీగా వేర్వేరు మార్కులు సాధించాల్సి వచ్చేది. ఓసీలైతే 40 శాతం.. బీసీలకు 35 శాతం.. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు 30 శాతం రావాల్సి ఉండేది. అప్పట్లో నెగెటివ్‌ మార్కులుండేవి కావు. ఈసారి అందుకు భిన్నంగా అన్ని కేటగిరీల అభ్యర్థులకు 30 శాతమే అర్హతగా పరిగణించనున్నారు.

200 మార్కులున్న ప్రశ్నపత్రంలో 60 సరైన సమాధానాలు గుర్తించగలిగితే తదుపరి అంకమైన శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించగలుగుతారు. ఓఎంఆర్‌ షీట్‌లో ఎలాంటి బబ్లింగ్‌ లేకుండా ఉన్న సమాధానాలకు సున్నా మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాకాకుండా బబ్లింగ్‌ చేసిన జవాబు తప్పయితే నెగెటివ్‌ మార్కులు వేయనున్నారు. ఐదు తప్పుడు సమాధానాలకు ఒక్కో నెగెటివ్‌ మార్కు పడనుంది. కాబట్టి ఊహించి సమాధానాలు రాయకపోవడమే ఉత్తమమని మండలి ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

మూడు లక్షలకు పైగా దరఖాస్తుల తిరస్కరణ..

ఈసారి పలు కారణాలతో భారీగా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తొలుత 17,291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిలో 587 ఎస్సై పోస్టులు కాగా సుమారు 2.47 లక్షల దరఖాస్తులొచ్చాయి. అలాగే 16,704 కానిస్టేబుళ్ల పోస్టులకు దాదాపు 9.54 లక్షల మంది దరఖాస్తు చేశారు. పరిశీలన అనంతరం ఎస్సై పోస్టులకు సుమారు 2.45 లక్షలు, కానిస్టేబుల్‌ పోస్టులకు 6.5 లక్షల దరఖాస్తులే మిగిలాయి. కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించి వేర్వేరు విభాగాలకు వేర్వేరు సెల్‌నంబర్లతో దరఖాస్తులు చేసుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా మండలి వర్గాలు గుర్తించాయి.

ఇవీ చూడండి..

పోలీస్​ ప్రాథమిక రాతపరీక్ష అర్హతలో ఈసారి మార్పులు చేశారు. 2018 నోటిఫికేషన్‌ సమయంలో పీడబ్ల్యూటీలో అర్హత పొందేందుకు కేటగిరీల వారీగా వేర్వేరు మార్కులు సాధించాల్సి వచ్చేది. ఓసీలైతే 40 శాతం.. బీసీలకు 35 శాతం.. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు 30 శాతం రావాల్సి ఉండేది. అప్పట్లో నెగెటివ్‌ మార్కులుండేవి కావు. ఈసారి అందుకు భిన్నంగా అన్ని కేటగిరీల అభ్యర్థులకు 30 శాతమే అర్హతగా పరిగణించనున్నారు.

200 మార్కులున్న ప్రశ్నపత్రంలో 60 సరైన సమాధానాలు గుర్తించగలిగితే తదుపరి అంకమైన శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించగలుగుతారు. ఓఎంఆర్‌ షీట్‌లో ఎలాంటి బబ్లింగ్‌ లేకుండా ఉన్న సమాధానాలకు సున్నా మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాకాకుండా బబ్లింగ్‌ చేసిన జవాబు తప్పయితే నెగెటివ్‌ మార్కులు వేయనున్నారు. ఐదు తప్పుడు సమాధానాలకు ఒక్కో నెగెటివ్‌ మార్కు పడనుంది. కాబట్టి ఊహించి సమాధానాలు రాయకపోవడమే ఉత్తమమని మండలి ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

మూడు లక్షలకు పైగా దరఖాస్తుల తిరస్కరణ..

ఈసారి పలు కారణాలతో భారీగా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తొలుత 17,291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిలో 587 ఎస్సై పోస్టులు కాగా సుమారు 2.47 లక్షల దరఖాస్తులొచ్చాయి. అలాగే 16,704 కానిస్టేబుళ్ల పోస్టులకు దాదాపు 9.54 లక్షల మంది దరఖాస్తు చేశారు. పరిశీలన అనంతరం ఎస్సై పోస్టులకు సుమారు 2.45 లక్షలు, కానిస్టేబుల్‌ పోస్టులకు 6.5 లక్షల దరఖాస్తులే మిగిలాయి. కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించి వేర్వేరు విభాగాలకు వేర్వేరు సెల్‌నంబర్లతో దరఖాస్తులు చేసుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా మండలి వర్గాలు గుర్తించాయి.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.