ETV Bharat / city

వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే.. అల్లూరి స్ఫూర్తితో ముందుకు : కేటీఆర్

author img

By

Published : Jul 4, 2022, 11:57 AM IST

KTR Tribute to Alluri : హైదరాబాద్ ట్యాంక్​బండ్​పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు కేటీఆర్​, శ్రీనివాస్​ గౌడ్​, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ktr
ktr
ktr

KTR Tribute to Alluri Sitaramaraju : అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా.. కుట్రలు చేసినా.. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనన్నారు. అల్లూరిని గుర్తు చేసుకోవడం భారత పౌరుల విధి అని కేటీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ ట్యాంక్​ బండ్​పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు కేటీఆర్​, శ్రీనివాస్​ గౌడ్​, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్షత్రియ వర్గంలోని పేదల కోసం ప్రభుత్వం మూడెకరాల భూమి కేటాయించిందని కేటీఆర్​ తెలిపారు. త్వరలోనే అక్కడ భూమి పూజ నిర్వహించాలని కోరారు.

'వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే. అల్లూరిని గుర్తు చేసుకోవడం భారత పౌరుడి విధి. ప్రభుత్వం అల్లూరి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తోంది. ఎన్ని ప్రతికూలతలు, కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్​ కృషి చేస్తున్నారు.' -మంత్రి కేటీఆర్

ఇవీ చూడండి :

ktr

KTR Tribute to Alluri Sitaramaraju : అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా.. కుట్రలు చేసినా.. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనన్నారు. అల్లూరిని గుర్తు చేసుకోవడం భారత పౌరుల విధి అని కేటీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ ట్యాంక్​ బండ్​పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు కేటీఆర్​, శ్రీనివాస్​ గౌడ్​, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్షత్రియ వర్గంలోని పేదల కోసం ప్రభుత్వం మూడెకరాల భూమి కేటాయించిందని కేటీఆర్​ తెలిపారు. త్వరలోనే అక్కడ భూమి పూజ నిర్వహించాలని కోరారు.

'వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే. అల్లూరిని గుర్తు చేసుకోవడం భారత పౌరుడి విధి. ప్రభుత్వం అల్లూరి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తోంది. ఎన్ని ప్రతికూలతలు, కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్​ కృషి చేస్తున్నారు.' -మంత్రి కేటీఆర్

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.