ETV Bharat / city

పాత గుంటూరు ఠాణాపై దాడి కేసు 22కి వాయిదా.. - పాత గుంటూరు పీఎస్​పై దాడి కేసుకు సంబంధించిన విచారణలో జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యలు

పాత గుంటూరు ఠాణాపై దాడి కేసుని ఈ నెల 22కి వాయిదా వేశారు. ఈ కేసు విచారణ సమయంలో జస్టిస్ రాకేశ్ కుమార్ మాట్లాడుతూ.. పదవీ విరమణ దశలో ఆరోపణలు ఎదుర్కొంటున్నానని.. ఆవేదన వ్యక్తం చేశారు.

justice rakesh kumar words
పాత గుంటూరు ఠాణాపై దాడి కేసు ఉపసంహరణ విచారణ
author img

By

Published : Dec 18, 2020, 7:22 AM IST

పాత గుంటూరు ఠాణాపై దాడి కేసుల ఉపసంహరణను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో.. తనను విచారణ నుంచి తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తుందేమో చూద్దామని జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అందుకే విచారణను ఈనెల 22కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పదవీ విరమణ దశలో ఆరోపణలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

2018 మేలో పాత గుంటూరు పీఎస్​పై దాడి జరిగింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ కొందరు ముస్లిం యువకులపై ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అందుకు సంబంధించిన విచారణను ఉపసంహరించేందుకు.. ఈ ఏడాది ఆగస్టు 12న హోంశాఖ జీవో జారీ చేసింది. దానిని సవాలు చేస్తూ.. గణేష్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థాం.. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఎఫ్ఐఆర్ విషయంలో యథాతథస్థితి పాటించాలని ఆదేశించింది. ఠాణా​ మీద దాడి చేశారని పోలీసులే ఫిర్యాదు చేసినా, నిందితులపై విచారణ ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. పిటిషనర్ తరపు న్యాయవాది పీఎస్​పీ సురేశ్ కుమార్ వాదించారు. దర్యాప్తు ఇంకా పెండింగ్​లో ఉందని తెలిపారు.

పాత గుంటూరు ఠాణాపై దాడి కేసుల ఉపసంహరణను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో.. తనను విచారణ నుంచి తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తుందేమో చూద్దామని జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అందుకే విచారణను ఈనెల 22కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పదవీ విరమణ దశలో ఆరోపణలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

2018 మేలో పాత గుంటూరు పీఎస్​పై దాడి జరిగింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ కొందరు ముస్లిం యువకులపై ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అందుకు సంబంధించిన విచారణను ఉపసంహరించేందుకు.. ఈ ఏడాది ఆగస్టు 12న హోంశాఖ జీవో జారీ చేసింది. దానిని సవాలు చేస్తూ.. గణేష్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థాం.. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఎఫ్ఐఆర్ విషయంలో యథాతథస్థితి పాటించాలని ఆదేశించింది. ఠాణా​ మీద దాడి చేశారని పోలీసులే ఫిర్యాదు చేసినా, నిందితులపై విచారణ ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. పిటిషనర్ తరపు న్యాయవాది పీఎస్​పీ సురేశ్ కుమార్ వాదించారు. దర్యాప్తు ఇంకా పెండింగ్​లో ఉందని తెలిపారు.

ఇదీ చదవండి:

అక్కడ రైతులు అనేవాళ్లే లేరు: పేర్ని నాని

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.