ETV Bharat / city

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్ష ప్రారంభం

author img

By

Published : Sep 1, 2020, 10:39 AM IST

జేఈఈ మెయిన్ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే విద్యార్థులను లోనికి అనుమతిస్తున్నారు. కొవిడ్​ లక్షణాలు ఉన్నవారి కోసం అధికారులు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు.

jee-mains-exams-start-in-all-over-india
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్ష ప్రారంభం

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్​ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 82వేల 748మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తంగా 1,50,059 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

కృష్ణా జిల్లాలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో 13వేల మంది విద్యార్ధులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల, ఉషారామా ఇంజనీరింగ్ కళాశాల, ఎన్ఆర్ఐటీ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ రెండు అయాన్ సెంటర్లలో పరీక్షలకు కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఆరో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ పరీక్ష ఉండగా.. రెండో తేదీ నుంచి బీటెక్‌, బీఈ పరీక్ష ఉంటుంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 3గంటల నుంచి 6గంటల వరకు ఇలా రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు.

కొవిడ్‌ లక్షణాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. వీటిల్లోని పర్యవేక్షకులకు పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు అందరికీ థర్మల్‌స్క్రీనింగ్‌ చేస్తారు.

  • చీరాల, ఒంగోలులో మెుదలు..

జేఈఈ మెయిన్ పరీక్ష ప్రకాశం జిల్లా చీరాల, ఒంగోలులో ప్రారంభమయింది. ఒంగోలులో మూడు, చీరాల పరిధిలోని వేటపాలెంలోని ఇంజినీరింగ్ కళాశాలలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆరు రోజులపాటు... రోజుకు రెండు షిఫ్తుల్లో పరీక్షలు జరుగనున్నాయి. 3వేల 500 మంది విద్యార్థులు ప్రకాశం జిల్లాలో పరీక్షలు రాస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో... పరీక్షా కేంద్రాల వద్ద స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను లోపలికి అనుమతి ఇస్తున్నారు.

ఇదీ చదవండి: నేటి నుంచి విద్యార్థులకు వీడియో పాఠాలు

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్​ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 82వేల 748మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తంగా 1,50,059 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

కృష్ణా జిల్లాలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో 13వేల మంది విద్యార్ధులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల, ఉషారామా ఇంజనీరింగ్ కళాశాల, ఎన్ఆర్ఐటీ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ రెండు అయాన్ సెంటర్లలో పరీక్షలకు కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఆరో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ పరీక్ష ఉండగా.. రెండో తేదీ నుంచి బీటెక్‌, బీఈ పరీక్ష ఉంటుంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 3గంటల నుంచి 6గంటల వరకు ఇలా రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు.

కొవిడ్‌ లక్షణాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. వీటిల్లోని పర్యవేక్షకులకు పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు అందరికీ థర్మల్‌స్క్రీనింగ్‌ చేస్తారు.

  • చీరాల, ఒంగోలులో మెుదలు..

జేఈఈ మెయిన్ పరీక్ష ప్రకాశం జిల్లా చీరాల, ఒంగోలులో ప్రారంభమయింది. ఒంగోలులో మూడు, చీరాల పరిధిలోని వేటపాలెంలోని ఇంజినీరింగ్ కళాశాలలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆరు రోజులపాటు... రోజుకు రెండు షిఫ్తుల్లో పరీక్షలు జరుగనున్నాయి. 3వేల 500 మంది విద్యార్థులు ప్రకాశం జిల్లాలో పరీక్షలు రాస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో... పరీక్షా కేంద్రాల వద్ద స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను లోపలికి అనుమతి ఇస్తున్నారు.

ఇదీ చదవండి: నేటి నుంచి విద్యార్థులకు వీడియో పాఠాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.