ETV Bharat / city

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై.. కేసీఆర్​కు పవన్ ట్వీట్

author img

By

Published : Nov 20, 2019, 8:47 PM IST

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ కోరారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని ట్వీట్ చేశారు.

janasena-president-pawan-kalyan
పవన్ ట్వీట్
పవన్ ట్వీట్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినందున ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కార్మిక సంఘాల నాయకులు తనను కోరినట్లు తెలిపారు. నలభై రోజులకు పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి తగిన భరోసా ఇస్తారని ఆకాంక్షించారు. తద్వారా ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.

పవన్ ట్వీట్
పవన్ ట్వీట్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినందున ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కార్మిక సంఘాల నాయకులు తనను కోరినట్లు తెలిపారు. నలభై రోజులకు పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి తగిన భరోసా ఇస్తారని ఆకాంక్షించారు. తద్వారా ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:

బేషరతుగా ఆహ్వానిస్తే విధులకు హాజరయ్యేందుకు సిద్ధం: అశ్వత్థామరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.