విశాఖ ఫార్మాసిటీలో ప్రమాదం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదని పవన్ ప్రశ్నించారు. ప్రమాదకర రసాయనాల నిల్వలో జాగ్రత్తలు తీసుకోరా అని నిలదీశారు. రక్షణ ఏర్పాట్లు బాగుంటే ప్రమాదం ఎలా జరిగిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: