ETV Bharat / city

నీలకంఠాపురంలో పురావస్తు పరిశోధనలు.. బయటపడిన చారిత్రక ఆనవాళ్లు - మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

మడకశిర ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు పర్యటించారు. మాజీ పీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్వగ్రామం నీలకంఠాపురంలో చారిత్రక ఆనవాళ్లపై పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు విగ్రహాలు, మట్టిపాత్రలు, ఇటుక రాతి ముక్కలు వెలికి తీశారు. వీటిపై పూర్తి అధ్యయనం జరిపి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.

historical landmarks found at neelakantapuram
historical landmarks found at neelakantapuram
author img

By

Published : Mar 22, 2021, 4:25 PM IST

మడకశిరలో పరిశోధనలు..వెలుగులోకి ఆసక్తికర అంశాలు!

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పురావస్తు శాఖ అధికారుల బృందం చారిత్రాత్మక ఆనవాళ్లపై పరిశోధనలు జరిపారు. ఇందులో భాగంగా నీలకంఠాపురం గ్రామంలో... మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమాచారం మేరకు చరిత్రకారుడు, ఇంటాక్‌ పీఈవో డాక్టర్‌ శివనాగిరెడ్డి బృందం పర్యటించింది. నీలకంఠాపురం సమీపంలోని చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించి పలు విగ్రహాలు, మట్టి పాత్రలు, శాతవాహన కాలపు కుండ పెంకులు, ఇటుక రాతి ముక్కలు, వెలికి తీశారు.

మునీశ్వరస్వామి దేవాలయం వద్ద క్రీస్తుశకం 16వ శతాబ్దం నాటి సూర్య విగ్రహం, అభయాంజనేయస్వామి ఆలయంలోని విగ్రహాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం రొళ్ల మండలం రత్నగిరి, అమరాపురం మండలం హేమావతి చారిత్రాత్మక ఆలయాలను సందర్శించారు. రానున్న రెండు నెలల్లో నూతన ఆలయ ప్రారంభం రోజున గ్రామ చరిత్రపై పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని రఘువీరారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా పురావస్తు శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

జనతా కర్ఫ్యూకు ఏడాది- మళ్లీ అదే పరిస్థితా?

మడకశిరలో పరిశోధనలు..వెలుగులోకి ఆసక్తికర అంశాలు!

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పురావస్తు శాఖ అధికారుల బృందం చారిత్రాత్మక ఆనవాళ్లపై పరిశోధనలు జరిపారు. ఇందులో భాగంగా నీలకంఠాపురం గ్రామంలో... మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమాచారం మేరకు చరిత్రకారుడు, ఇంటాక్‌ పీఈవో డాక్టర్‌ శివనాగిరెడ్డి బృందం పర్యటించింది. నీలకంఠాపురం సమీపంలోని చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించి పలు విగ్రహాలు, మట్టి పాత్రలు, శాతవాహన కాలపు కుండ పెంకులు, ఇటుక రాతి ముక్కలు, వెలికి తీశారు.

మునీశ్వరస్వామి దేవాలయం వద్ద క్రీస్తుశకం 16వ శతాబ్దం నాటి సూర్య విగ్రహం, అభయాంజనేయస్వామి ఆలయంలోని విగ్రహాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం రొళ్ల మండలం రత్నగిరి, అమరాపురం మండలం హేమావతి చారిత్రాత్మక ఆలయాలను సందర్శించారు. రానున్న రెండు నెలల్లో నూతన ఆలయ ప్రారంభం రోజున గ్రామ చరిత్రపై పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని రఘువీరారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా పురావస్తు శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

జనతా కర్ఫ్యూకు ఏడాది- మళ్లీ అదే పరిస్థితా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.