ETV Bharat / city

న్యాయస్థానం కళ్లు మూసుకుని ఉండదు : హైకోర్టు

author img

By

Published : Mar 5, 2021, 8:42 AM IST

సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం చేయడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. కోర్టు కళ్లు మూసుకుని ఉండదని.. ప్రభుత్వం సరిగా స్పందించకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని ఘాటుగా వ్యాఖ్యానించింది.

high court trial on pacs elections
సహకార సంఘాల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ

వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కాలపరిమితి ముగిసినా జాప్యం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్దిష్ట సమయానికి ఎన్నికలు జరపాలన్న రాజ్యాంగ నిబంధన పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ప్రతిసారీ గుర్తుచేయాల్సిన అవసరం ఏమిటని నిలదీసింది. న్యాయస్థానం కళ్లు మూసుకుని ఉండదని.. ప్రభుత్వం స్పందించకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో​ కూడిన ధర్మాసనం.. విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.

ప్రభుత్వానికి నిబంధనలు తెలుసుకదా...?

2018 జూన్ లో సహకార సంఘాల కాలపరిమితి ముగిసిన అనంతరం.. మూడుసార్లు పొడిగించినట్లు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. వాటిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందన్నారు. అందుకే ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగిందన్నారు. 'జరిగిందేదో జరిగిపోయింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనలు ప్రభుత్వానికి తెలుసుకదా? రాజ్యాంగ నిబంధనల గురించి తెలియకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్లండి' అని న్యాయస్థానం సూచించింది. అన్నింటికన్నా రాజ్యాంగం సర్వోన్నతమైనదని వ్యాఖ్యానించింది. వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని జీపీ కోరగా.. ధర్మాసనం అంగీకరించింది.

చట్టం ఏం చెబుతోంది?

కాలపరిమితి ముగిసిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని.. సహకార సంఘ చట్టం స్పష్టం చేస్తోంది. అన్ని సంఘాలనూ ఆ నియమాల నుంచి మినహాయిస్తూ.. జులై 30, 2019న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. వాటికి పర్సన్ ఇంఛార్జిలను నియమించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో గతంలో పలు వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి.

ఇదీ చదవండి:

రేపటి బంద్​కు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సంపూర్ణ మద్ద

వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కాలపరిమితి ముగిసినా జాప్యం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్దిష్ట సమయానికి ఎన్నికలు జరపాలన్న రాజ్యాంగ నిబంధన పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ప్రతిసారీ గుర్తుచేయాల్సిన అవసరం ఏమిటని నిలదీసింది. న్యాయస్థానం కళ్లు మూసుకుని ఉండదని.. ప్రభుత్వం స్పందించకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో​ కూడిన ధర్మాసనం.. విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.

ప్రభుత్వానికి నిబంధనలు తెలుసుకదా...?

2018 జూన్ లో సహకార సంఘాల కాలపరిమితి ముగిసిన అనంతరం.. మూడుసార్లు పొడిగించినట్లు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. వాటిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందన్నారు. అందుకే ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగిందన్నారు. 'జరిగిందేదో జరిగిపోయింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనలు ప్రభుత్వానికి తెలుసుకదా? రాజ్యాంగ నిబంధనల గురించి తెలియకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్లండి' అని న్యాయస్థానం సూచించింది. అన్నింటికన్నా రాజ్యాంగం సర్వోన్నతమైనదని వ్యాఖ్యానించింది. వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని జీపీ కోరగా.. ధర్మాసనం అంగీకరించింది.

చట్టం ఏం చెబుతోంది?

కాలపరిమితి ముగిసిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని.. సహకార సంఘ చట్టం స్పష్టం చేస్తోంది. అన్ని సంఘాలనూ ఆ నియమాల నుంచి మినహాయిస్తూ.. జులై 30, 2019న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. వాటికి పర్సన్ ఇంఛార్జిలను నియమించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో గతంలో పలు వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి.

ఇదీ చదవండి:

రేపటి బంద్​కు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సంపూర్ణ మద్ద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.