ETV Bharat / city

'స్వచ్ఛంద సంప్రదింపులు'పై పూర్తి వివరాలు ఇవ్వండి: హైకోర్టు

author img

By

Published : Jul 21, 2020, 2:08 AM IST

పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా స్థలాలిచ్చేందుకు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 'స్వచ్ఛంద సంప్రదింపులు' ద్వారా భూసేకరణ జరపడాన్ని సవాలు చేస్తూ... దాఖలైన పిల్​పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బి.కృష్ణమోహన్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.

high court comments Voluntary consultation over land equitation
హైకోర్టు

స్వచ్ఛంద సంప్రదింపుల ద్వారా భూసేకరణను సవాలు చేస్తూ... తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సత్తి భగవాన్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. భూ సేకరణ చట్టం-2013 నిబంధనలకు విరుద్ధంగా... ఇళ్ల స్థలాల కోసం భూమిని సేకరిస్తున్నారని పిల్​లో పేర్కొన్నారు. సంప్రదింపుల ద్వారా భూ సేకరణ నిమిత్తం పాలనాధికారులు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి, తూర్పు, పశ్చిమ, గుంటూరు, కృష్ణా జిల్లాల పాలనాధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

స్వచ్ఛంద సంప్రదింపుల ద్వారా భూసేకరణను సవాలు చేస్తూ... తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సత్తి భగవాన్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. భూ సేకరణ చట్టం-2013 నిబంధనలకు విరుద్ధంగా... ఇళ్ల స్థలాల కోసం భూమిని సేకరిస్తున్నారని పిల్​లో పేర్కొన్నారు. సంప్రదింపుల ద్వారా భూ సేకరణ నిమిత్తం పాలనాధికారులు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి, తూర్పు, పశ్చిమ, గుంటూరు, కృష్ణా జిల్లాల పాలనాధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇదీ చదవండీ...

వివేకా హత్య కేసు: 3వ రోజు సీబీఐ సుదీర్ఘ విచారణ.. తర్వాత ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.