ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా 101 మండలాల్లో వడగాలులు

author img

By

Published : May 23, 2020, 9:44 AM IST

రాష్ట్రంలో సూర్యుడు భగ్గుమంటున్నాడు. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా.. ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. శుక్రవారం గరిష్ఠంగా కృష్ణా జిల్లా గన్నవరం, ఉంగుటూరులో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

heatwave
heatwave

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం గరిష్ఠంగా కృష్ణా జిల్లా గన్నవరం, ఉంగుటూరులో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరుతోపాటు పలు జిల్లాల్లోని 101 మండలాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది.

537 మండలాల్లో ఉష్ణతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇవాళ, రేపు ఎండలు, వడగాలులు కొనసాగనున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని సూచించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం గరిష్ఠంగా కృష్ణా జిల్లా గన్నవరం, ఉంగుటూరులో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరుతోపాటు పలు జిల్లాల్లోని 101 మండలాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది.

537 మండలాల్లో ఉష్ణతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇవాళ, రేపు ఎండలు, వడగాలులు కొనసాగనున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని సూచించింది.

ఇదీ చదవండి:

అగ్రరాజ్యం నేవీలో.. తెలుగు తేజం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.