రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారంటూ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఆగస్టు 5 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కౌంటర్పై రిప్లై కౌంటర్ను ఆగస్టు 12లోపు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 12న చేపడతామని ధర్మాసనం తెలిపింది.
ఏసీబీ నమోదు చేసిన కేసుపై హైకోర్టు స్టే విధించటంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ అప్పీల్ను సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నాలుగు వారాల్లో ఈ కేసును పరిష్కరించాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది.
ఇదీ చదవండి
DAMMALAPATI: దమ్మాలపాటి వ్యవహారంలో.. సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరణ