ETV Bharat / city

పింఛన్ ఇచ్చిన జగన్​కే ఓటేయాలమ్మా: ఎంపీడీవో ప్రచారం - వివాదస్పదమైన బ్రహ్మంగారిమఠం ఎంపీడీవో కామెంట్స్ వార్తలు

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల ఎంపీడీవో వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నూతన పింఛన్లను పంపిణీ చేస్తూ ఓ వృద్ధురాలి దగ్గరకు వెళ్లిన ఆయన.. ఓటు ఎవరికి వేస్తావని ప్రశ్నించారు. అందుకు బదులుగా.. "ఇంకెవరికి? ఆయనకే వేస్తా" అంటూ సీఎం జగన్ ఫొటో చూపించింది. ఆ వెంటనే.. "మరిచిపోకమ్మా.. జగన్​కే ఓటేయాలి నువ్వు" అంటూ.. ఆ ఎంపీడీవో చెప్పడం.. వివాదాస్పదమైంది.

జగన్ పింఛన్ ఇచ్చాడు..ఆయనకే ఓటెయ్యాలి: ఓ ప్రభుత్వోద్యోగి
పింఛన్ పంపిణీ చేస్తూ వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎంపీడీవో
author img

By

Published : Jun 20, 2020, 3:07 PM IST

Updated : Jun 20, 2020, 4:38 PM IST

పింఛన్ పంపిణీ చేస్తూ వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎంపీడీవో

'వచ్చె నెల నుంచి 2 వేల 500 రూపాయల పింఛను వస్తుంది. ఎవరిస్తారనుకుంటున్నావ్ పింఛన్ జగన్.. తెలుసు కదా.. సీఎం గారూ.. నీకు మంజూరు చేశారు. నీ కోసం లెటర్ కూడా పంపించారు. మరిచిపోవద్దు ఆయనను. ఓటు ఎవరికేస్తావ్? జగన్​కే వేయాలి.' ఈ మాటలు అన్నది ఏ ప్రజా ప్రతినిథో అనుకుంటే.. మీరు పొరబడినట్లే. ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలివి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఎంపీడీఓ చెప్పిన మాటలివి. ప్రభుత్వ అధికారిగా పని చేస్తూ.. అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఆయన తీరు.. వివాదాస్పదమవుతోంది.

పింఛన్ పంపిణీ చేస్తూ వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎంపీడీవో

'వచ్చె నెల నుంచి 2 వేల 500 రూపాయల పింఛను వస్తుంది. ఎవరిస్తారనుకుంటున్నావ్ పింఛన్ జగన్.. తెలుసు కదా.. సీఎం గారూ.. నీకు మంజూరు చేశారు. నీ కోసం లెటర్ కూడా పంపించారు. మరిచిపోవద్దు ఆయనను. ఓటు ఎవరికేస్తావ్? జగన్​కే వేయాలి.' ఈ మాటలు అన్నది ఏ ప్రజా ప్రతినిథో అనుకుంటే.. మీరు పొరబడినట్లే. ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలివి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఎంపీడీఓ చెప్పిన మాటలివి. ప్రభుత్వ అధికారిగా పని చేస్తూ.. అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఆయన తీరు.. వివాదాస్పదమవుతోంది.

ఇదీ చదవండి:

ఏడాదిలో సంక్షేమం కోసం రూ.43వేల కోట్లు ఖర్చు :సీఎం జగన్

Last Updated : Jun 20, 2020, 4:38 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.