ఆదివారం దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా దీపాల పండుగ నిలుస్తుందన్నారు. రంగురంగుల దీపాలు వెలిగించి ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. శాంతికి, మత సామరస్యానికి, నవసమాజ నిర్మాణానికి ఈ పండుగ ఆదర్శంగా నిలవాలని అభిలషించారు.
ఇవీ చదవండి: