ETV Bharat / city

Gone Prakash Rao: భాజపా తలుచుకుంటే జగన్ జైలుకే: గోనె ప్రకాష్ రావు

author img

By

Published : Jun 18, 2021, 4:50 PM IST

Updated : Jun 18, 2021, 5:17 PM IST

భాజపా అనుకుంటే జగన్ బెయిల్ రద్దయ్యి.. జైలుకెళ్లడం ఖాయమన్నారు తెలంగాణ నేత గోనె ప్రకాష్​రావు. తిరుపతి ప్రెస్ క్లబ్​లో మాట్లాడిన ఆయన.. వైఎస్ వివేకా హత్య కేసులో బంధువులపై ఆరోపణలు చేశారు. వివేకా హత్యను కొందరు వైకాపా నేతలు.. గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

gone prakash rao
gone prakash rao
గోనె ప్రకాష్ రావు

తెలంగాణ నేత, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) సీఎం జగన్ (cm jagan) పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ బెయిల్ రద్దయ్యి జైలుకు పోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలు చెబుతుంటే వైకాపా నేతలు, పార్టీ శ్రేణులు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలానే బెదిరింపులకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. జగన్ అసలు స్వరూపాన్ని బయటపెడతానన్నారు. తెలంగాణాలోనే కాదు ఏపీలోనూ మీడియా సమావేశాలు నిర్వహించి జగన్ స్వరూపాన్ని బయట పెట్టే ధైర్యం ఉందన్నారు.

వైఎస్సార్ పాదయాత్రలో జగన్ ఏ రోజు పాల్గొనలేదని.. వైఎస్ విజయమ్మ తన పుస్తకంలో అవాస్తవాలు రాశారన్నారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ.. ఖమ్మంలో ఏర్పాటు చేసిన షర్మిల సభలో ఏ విధంగా పాల్గొన్నారని నిలదీశారు. ఆమెకు జగన్.. ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదన్నారు. వివేకా హత్య(viveka murder)ను.. ఆ పార్టీలోని కొందరు నేతలు గుండెపోటుగా చూపించే ప్రయత్నం ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ (CBI) విచారణ అడిగిన జగన్.. ఇప్పుడు ఎందుకు స్పందించటంలేదని ఆక్షేపించారు.

ఇదీ చదవండి

AP Jobs: జాబ్ కేలండర్ విడుదల.. ఇకనుంచి ఇంటర్వూలు లేవ్!

గోనె ప్రకాష్ రావు

తెలంగాణ నేత, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) సీఎం జగన్ (cm jagan) పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ బెయిల్ రద్దయ్యి జైలుకు పోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలు చెబుతుంటే వైకాపా నేతలు, పార్టీ శ్రేణులు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలానే బెదిరింపులకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. జగన్ అసలు స్వరూపాన్ని బయటపెడతానన్నారు. తెలంగాణాలోనే కాదు ఏపీలోనూ మీడియా సమావేశాలు నిర్వహించి జగన్ స్వరూపాన్ని బయట పెట్టే ధైర్యం ఉందన్నారు.

వైఎస్సార్ పాదయాత్రలో జగన్ ఏ రోజు పాల్గొనలేదని.. వైఎస్ విజయమ్మ తన పుస్తకంలో అవాస్తవాలు రాశారన్నారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ.. ఖమ్మంలో ఏర్పాటు చేసిన షర్మిల సభలో ఏ విధంగా పాల్గొన్నారని నిలదీశారు. ఆమెకు జగన్.. ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదన్నారు. వివేకా హత్య(viveka murder)ను.. ఆ పార్టీలోని కొందరు నేతలు గుండెపోటుగా చూపించే ప్రయత్నం ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ (CBI) విచారణ అడిగిన జగన్.. ఇప్పుడు ఎందుకు స్పందించటంలేదని ఆక్షేపించారు.

ఇదీ చదవండి

AP Jobs: జాబ్ కేలండర్ విడుదల.. ఇకనుంచి ఇంటర్వూలు లేవ్!

Last Updated : Jun 18, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.