- ఆ జిల్లాల్లో మళ్లీ లాక్డౌన్
కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మూడు జిల్లాల పరిధిలో మళ్లీ లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెండో విడత 'నేతన్న నేస్తం
'వైఎస్సార్ నేతన్న నేస్తం' రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. దీని ద్వారా 81,024 మందికి 194.46 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పది పరీక్షలపై కీలక నిర్ణయం
రాష్ట్రంలో పది పరీక్షలు నిర్వహిస్తారా?... లేదా? అన్న ప్రశ్నలకు నేడో, రేపో స్పష్టమైన సమాధానం రానుంది. దీనిపై అధికారులు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒక్కరితో మొదలయ్యాం...
2024 నాటికి రాజ్యసభలో తమ పార్టీ సభ్యుల సంఖ్య 11 అవుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంటు ఉభయసభల్లో 30 మందికి పైగా సభ్యులున్న పార్టీకి కేంద్రంలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సరిహద్దుల్లో సమర ధ్వని
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా దొంగదెబ్బ కొట్టిన తరుణంలో మన సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి. దీంతో భారత వాయుసేన రంగంలోకి దిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశ రాజధానికి భారీ ముప్పు
దేశరాజధానిలో వరుసగా సంభవిస్తోన్న భూప్రకంపనలు భారీ భూకంపాన్ని సూచిస్తున్నాయా? అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రాంతంలో పీడన శక్తి పెరుగుతోందని చెప్పడానికి ఇవి సంకేతాలుగా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక ధూర్త శక్తి'
భారత్తో సరిహద్దు వివాదాన్ని చైనా సైన్యం తీవ్రతరం చేస్తోందని విమర్శించింది అమెరికా. చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) ఒక 'ధూర్త శక్తి'గా అభివర్ణించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెట్రోల్, డీజిల్ ధరల మంటలు
దేశంలో జూన్ 9 నుంచి పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం.. లీటరు పెట్రోల్పై 51 పైసలు, డీజిల్పై 61 పైసలు పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దాదా కుటుంబంలో కరోనా కలకలం
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్న స్నేహాశిష్ గంగూలీ భార్యకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. గతవారంలో స్నేహాశిష్ అత్త, మామలకూ కొవిడ్ సంక్రమించినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సెట్స్పైకి 'బంటీ ఔర్ బబ్లీ2'
కరోనా వల్ల నిలిచిపోయిన 'బంటీ ఔర్ బబ్లీ 2' షూటింగ్ను ఆగస్టులో తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. తొలుత ఓ పాటను తెరకెక్కించాలని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.