వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా విఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడి(NORI DATTATHREYUDU)ని నియమించాలని సీఎం జగన్(CM JAGAN NEWS) నిర్ణయించారు. ఈ మేరకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన డాక్టర్ నోరి.. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులలో చేపడుతున్న నాడు-నేడు, వైద్యఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఉండాలని డాక్టర్ నోరిని సీఎం కోరారు.
ఇదీ చదవండి: