ETV Bharat / city

తెలంగాణలో 'దుకాణాల సమయం కుదింపు జీవో'.. ఫేక్!

author img

By

Published : Apr 1, 2021, 10:55 PM IST

తెలంగాణలో దుకాణాల సమయం కుదింపు చేస్తున్నట్టుగా ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయంటూ.. ఇవాళ ఓ జీవో కాపీ హల్ చల్ చేసింది. ఆ జీవో అంతా ఫేక్ అని.. ఎలాంటి వాస్తవమూ లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

cs somesh kumar clarity on shut down
cs somesh kumar clarity on shut down

దుకాణాల సమయం కుదింపు పుకార్లపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్న జీవో కాపీ నకిలీదని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ స్పష్టం చేశారు. రాత్రి వేళ దుకాణాలు మూసివేత తప్పుడు వార్త అని పేర్కొన్నారు.

దుకాణాలు సాయంత్రం 6 గంటలకు మూసివేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చామన్నది ఎంత మాత్రం నిజం కాదన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఉండదని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని ప్రచారం చేస్తే... అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

దుకాణాల సమయం కుదింపు పుకార్లపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్న జీవో కాపీ నకిలీదని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ స్పష్టం చేశారు. రాత్రి వేళ దుకాణాలు మూసివేత తప్పుడు వార్త అని పేర్కొన్నారు.

దుకాణాలు సాయంత్రం 6 గంటలకు మూసివేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చామన్నది ఎంత మాత్రం నిజం కాదన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఉండదని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని ప్రచారం చేస్తే... అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.