స్వామి భక్తి ఉంటే డబ్బులు, కానుకలు ఇవ్వాలే కానీ... 23 దేవాలయాల్లో స్వరూపానందేంద్ర జన్మదిన వేడుకలు చేయాలని ప్రభుత్వం మెమోలు జారీ చేయడమేంటని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. జగన్కు భాజపా గాలి సోకినట్టుందని... స్వామి ఏమి చెప్తే అది చేస్తున్న ప్రభుత్వం స్వామీజీలకు లొంగిపోయిందా అని నిలదీశారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నాలు చేస్తూ... ప్రాజెక్టుకు మంగళం పాడాలని చూస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. 22న పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి... భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
రాష్ట్ర ప్రతిష్ట, లౌకిక విలువలను సీఎం జగన్ దిగజారుస్తున్నారు: యనమల