ETV Bharat / city

కరోనా స్వైరవిహారం.. బెంబేలెత్తిస్తున్న పాజిటివిటీ

author img

By

Published : Aug 26, 2020, 6:02 AM IST

రాష్ట్రంలో కరోనా అంతకంతకూ స్వైరవిహారం చేస్తోంది. మే నెలాఖరు వరకూ 0.96 శాతంగానే ఉన్న పాజిటివ్‌ కేసుల రేటు ఆగస్టు 23 నాటికి 16.52కు ఎగబాకింది. తూర్పుగోదావరిలో వైరస్ స్వైరవిహారం చేస్తుంటే కృష్ణాలో వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. మొత్తం మరణాల సంఖ్యలో గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది.

కరోనా స్వైరవిహారం.. బెంబేలెత్తిస్తున్న పాజిటివిటీ
కరోనా స్వైరవిహారం.. బెంబేలెత్తిస్తున్న పాజిటివిటీ

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల శాతం రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఆగష్టు 23 నాటి వరకూ చేసిన పరీక్షల్లో ప్రతి వంద మందిలో 16.52 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు మార్చి రెండో వారంలో నమోదవగా అప్పట్నుంచి మే నెలాఖరు వరకూ నమోదైన పాజిటివ్‌ కేసులు 0.96 శాతం మాత్రమే. అది జూన్‌లో 2.163కు జులైలో 12.33 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పాజిటివ్‌ కేసుల శాతమూ పెరుగుతోంది. మార్చి నుంచి మే నెలాఖరు వరకూ 3 లక్షల 83వేలకుపైగా పరీక్షలు చేయగా ఆగస్టులో 23వ తేదీ వరకే 12 లక్షల 79వేల 928 పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 20 నాటికి తూర్పుగోదావరిలో ప్రతి వంద పరీక్షలకు 24.14 శాతం పాజిటివిటీతో తొలిస్థానంలో ఉండగా 7.75శాతంతో కృష్ణా జిల్లా చివరి స్థానంలో నిలిచింది

తూర్పుగోదావరిలో తగ్గిన ఉద్ధృతి

ఇక జిల్లాలవారీగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలోనే రోజువారీ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 1353 మందికి పాజిటివ్‌ తేలగా కేసుల సంఖ్య 52 వేల 39కి చేరింది. కాకినాడలో 290, రాజమహేంద్రవరంలో 149, అమలాపురం మండలంలో 90 పెద్దాపురంలో 86 మందికి కొవిడ్‌ నిర్ధరణైంది. జిల్లాలో ప్రస్తుతం 17వేల 750 మందికి చికిత్స కొనసాగుతోంది.

విశాఖ జిల్లా అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో.. ఎస్సై, ఏఎస్సై కరోనా బారినపడ్డారు. చీడిపల్లిలో నాటుసారాతో పట్టుబడ్డ 14 మందిని జైలుకు తరలించే ముందు పరీక్షలు నిర్వహించగా వారిలో ఏడుగురికి కరోనా ఉందని తేలింది.

తగ్గినట్టే తగ్గి

గుంటూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కాస్త తగ్గిన‌ట్లు కనిపించిన కరోనా ఒక్కసారిగా పంజా విసిరింది. కొత్తగా 917 కేసులు, ఆరు మరణాలు వెలుగుచూశాయి. మొత్తం 346 కరోనా మరణాలతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. గుంటూరు నగరం తర్వాత కరోనా మృతులు మాచర్లలోనే అధికంగా ఉండటంపై సంయుక్త కలెక్టర్‌ ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరసవ్యాప్తి నియంత్రణలో అధికారులు వెంటనే స్పందించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. వాలంటీర్లు, ఏఎన్​ఎమ్​ల పనితీరు మారకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. నరసరావుపేటలో నేటి నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారు. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో కొనుగోళ్లకు అనుమతులిచ్చారు.

చిత్తూరు జిల్లాలో కొత్తగా 967 మందికి కొవిడ్‌ సోకటంతో మొత్తం బాధితుల సంఖ్య 31వేల 292కి చేరుకుంది. తిరుపతిలో కేసులు అధికంగా బయటపడుతుండటంతో ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ పొడిగించారు. కర్నూలు జిల్లాలో మరో 781 మందికి కరోనా నిర్ధరించటంతో మొత్తం కేసుల సంఖ్య 40 వేలు దాటింది.

ఇదీ చదవండి : 8 స్పెషల్ కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల శాతం రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఆగష్టు 23 నాటి వరకూ చేసిన పరీక్షల్లో ప్రతి వంద మందిలో 16.52 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు మార్చి రెండో వారంలో నమోదవగా అప్పట్నుంచి మే నెలాఖరు వరకూ నమోదైన పాజిటివ్‌ కేసులు 0.96 శాతం మాత్రమే. అది జూన్‌లో 2.163కు జులైలో 12.33 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పాజిటివ్‌ కేసుల శాతమూ పెరుగుతోంది. మార్చి నుంచి మే నెలాఖరు వరకూ 3 లక్షల 83వేలకుపైగా పరీక్షలు చేయగా ఆగస్టులో 23వ తేదీ వరకే 12 లక్షల 79వేల 928 పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 20 నాటికి తూర్పుగోదావరిలో ప్రతి వంద పరీక్షలకు 24.14 శాతం పాజిటివిటీతో తొలిస్థానంలో ఉండగా 7.75శాతంతో కృష్ణా జిల్లా చివరి స్థానంలో నిలిచింది

తూర్పుగోదావరిలో తగ్గిన ఉద్ధృతి

ఇక జిల్లాలవారీగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలోనే రోజువారీ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 1353 మందికి పాజిటివ్‌ తేలగా కేసుల సంఖ్య 52 వేల 39కి చేరింది. కాకినాడలో 290, రాజమహేంద్రవరంలో 149, అమలాపురం మండలంలో 90 పెద్దాపురంలో 86 మందికి కొవిడ్‌ నిర్ధరణైంది. జిల్లాలో ప్రస్తుతం 17వేల 750 మందికి చికిత్స కొనసాగుతోంది.

విశాఖ జిల్లా అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో.. ఎస్సై, ఏఎస్సై కరోనా బారినపడ్డారు. చీడిపల్లిలో నాటుసారాతో పట్టుబడ్డ 14 మందిని జైలుకు తరలించే ముందు పరీక్షలు నిర్వహించగా వారిలో ఏడుగురికి కరోనా ఉందని తేలింది.

తగ్గినట్టే తగ్గి

గుంటూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా కాస్త తగ్గిన‌ట్లు కనిపించిన కరోనా ఒక్కసారిగా పంజా విసిరింది. కొత్తగా 917 కేసులు, ఆరు మరణాలు వెలుగుచూశాయి. మొత్తం 346 కరోనా మరణాలతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. గుంటూరు నగరం తర్వాత కరోనా మృతులు మాచర్లలోనే అధికంగా ఉండటంపై సంయుక్త కలెక్టర్‌ ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరసవ్యాప్తి నియంత్రణలో అధికారులు వెంటనే స్పందించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. వాలంటీర్లు, ఏఎన్​ఎమ్​ల పనితీరు మారకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. నరసరావుపేటలో నేటి నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారు. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో కొనుగోళ్లకు అనుమతులిచ్చారు.

చిత్తూరు జిల్లాలో కొత్తగా 967 మందికి కొవిడ్‌ సోకటంతో మొత్తం బాధితుల సంఖ్య 31వేల 292కి చేరుకుంది. తిరుపతిలో కేసులు అధికంగా బయటపడుతుండటంతో ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ పొడిగించారు. కర్నూలు జిల్లాలో మరో 781 మందికి కరోనా నిర్ధరించటంతో మొత్తం కేసుల సంఖ్య 40 వేలు దాటింది.

ఇదీ చదవండి : 8 స్పెషల్ కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.