ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 19 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

author img

By

Published : Apr 15, 2020, 11:47 AM IST

Updated : Apr 15, 2020, 12:29 PM IST

corona-health-bulletin
రాష్ట్రంలో కొత్తగా 19 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

11:45 April 15

కరోనా కేసులు

జిల్లాల వారీగా కరోనా కేసులు
జిల్లాల వారీగా కరోనా కేసులు

రాష్ట్రంలో  కరోనా పాజిటివ్ కేసులు  502కి పెరిగాయి. నిన్న సాయంత్రం 5 నుంచి ఉదయం 9 వరకు 19 కొత్త కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్​లో తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా కరోనా ఇద్దరు మృతి చెందారని చెప్పింది. గుంటూరులోని కుమ్మరి బజార్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్లు తెలిపింది. ఇప్పటివరకూ కరోనాతో మొత్తం 11 మంది మృతిచెందగా, 16 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని ప్రకటించింది.  

జిల్లాల్లో కేసులు

గుంటూరు జిల్లాలో కొత్తగా 4 కేసుల నమోదుతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 118 చేరిందని తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా 8 కరోనా పాజిటివ్‌ కేసులు రాగా, కేసుల సంఖ్య 31 చేరిందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కర్నూలు జిల్లాలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయని, దీంతో కేసుల సంఖ్య 97కు చేరిందని తెలిపింది. కృష్ణా జిల్లాలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదుతో.. కొవిడ్ కేసుల సంఖ్య 45 కరోనా చేరిందని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్​తో ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో 56, ప్రకాశంలో 42, కడప జిల్లాలో 33, చిత్తూరులో 23, కరోనా పాజిటివ్‌ కేసులు విశాఖ జిల్లాలో 20, అనంతపురం జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది.  

ఇదీ చదవండి :  వలస కూలీ.. బతుకు కూలి


 

11:45 April 15

కరోనా కేసులు

జిల్లాల వారీగా కరోనా కేసులు
జిల్లాల వారీగా కరోనా కేసులు

రాష్ట్రంలో  కరోనా పాజిటివ్ కేసులు  502కి పెరిగాయి. నిన్న సాయంత్రం 5 నుంచి ఉదయం 9 వరకు 19 కొత్త కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్​లో తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా కరోనా ఇద్దరు మృతి చెందారని చెప్పింది. గుంటూరులోని కుమ్మరి బజార్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్లు తెలిపింది. ఇప్పటివరకూ కరోనాతో మొత్తం 11 మంది మృతిచెందగా, 16 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని ప్రకటించింది.  

జిల్లాల్లో కేసులు

గుంటూరు జిల్లాలో కొత్తగా 4 కేసుల నమోదుతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 118 చేరిందని తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా 8 కరోనా పాజిటివ్‌ కేసులు రాగా, కేసుల సంఖ్య 31 చేరిందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కర్నూలు జిల్లాలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయని, దీంతో కేసుల సంఖ్య 97కు చేరిందని తెలిపింది. కృష్ణా జిల్లాలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదుతో.. కొవిడ్ కేసుల సంఖ్య 45 కరోనా చేరిందని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్​తో ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో 56, ప్రకాశంలో 42, కడప జిల్లాలో 33, చిత్తూరులో 23, కరోనా పాజిటివ్‌ కేసులు విశాఖ జిల్లాలో 20, అనంతపురం జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది.  

ఇదీ చదవండి :  వలస కూలీ.. బతుకు కూలి


 

Last Updated : Apr 15, 2020, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.