ETV Bharat / city

క్వారంటైన్ కేంద్రాల్లోని 7,587 మందికి పరీక్షలు

author img

By

Published : Apr 22, 2020, 5:32 PM IST

Updated : Apr 23, 2020, 2:09 AM IST

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. అందుకు తగ్గట్టుగా ఆయా జిల్లాల్లో ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తీవ్రత ఎక్కవగా ఉన్న పట్టణాల్లో ఆస్పత్రులను గుర్తించి అక్కడే చికిత్స అందిచాలని ఆదేశించారు. టెలిమెడిసిన్ నిమిత్తం కాల్ చేసిన వారికి మందులు కూడా ఇవ్వాలని స్పష్టం చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న 7,587 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు.

cm ys jagan
cm ys jagan

cm ys jagan review on corona situations in the state
కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష

కొవిడ్‌ 19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణ, పరీక్షల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులపై చర్చించారు. కేసులు ఎక్కువగా నమోదవుతోన్న జిల్లాలు సహా అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఐసీయూ బెడ్లను పెంచాలని ఆదేశించారు. అవసరమైతే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న పట్టణాల్లోనే ఆస్పత్రులను గుర్తించి అక్కడే చికిత్స అందించాలని చెప్పారు.

కరోనా పరీక్షలపై ఆరా

రాష్ట్రంలో నిర్వహిస్తున్న కరోనా పరీక్షలపై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకూ 41 వేల 512 మందికి పరీక్షలు చేయగా.. నిన్న ఒక్కరోజే 5 వేల 757 పరీక్షలు చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రతి పది లక్షల జనాభాకు 830 మందికి పరీక్షలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రం నిలిచిందని సీఎంకు అధికారులు తెలిపారు. ట్రూనాట్‌ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని అధికారులు వివరించారు. దీనివల్ల 2 గంటల్లోగా ఫలితం వస్తోందని, తగిన చర్యలు తీసుకునేందుకు వీలవుతోందని చెప్పారు. క్వారంటైన్​ కేంద్రాల్లో ఉన్న వారందరికీ పరీక్షలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఆ కారణంతోనే కొరియా కిట్లు

ర్యాపిడ్‌ టెస్టు కిట్ల పనితీరుపై సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో ఇప్పటికే 6 వేల వరకు శాంపిళ్లను పరిశీలించామని... ఆ కిట్లు మంచి పనితీరు కనబరుస్తున్నాయని అధికారులు తెలిపారు. చైనా కిట్లు విక్రయించేందుకు గతంలో కొందరు రాష్ట్రానికి వచ్చారని.. వాటి పని తీరు సంతృప్తికరంగా లేదని తెలిపారు. ఈ కారణంతోనే చైనా కిట్లను కాకుండా కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. టెలీ మెడిసిన్‌లో 300 మంది డాక్టర్లు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. కాల్‌ చేసిన వారికి ప్రిస్క్రిప్షన్లతో పాటు మందులు కూడా అందించాలని సీఎం ఆదేశించారు.

కార్యకలాపాలు కొనసాగాలి

కొవిడ్‌ -19 నివారణ జాగ్రత్తలతో గ్రీన్‌ క్లస్టర్లలో కార్యకలాపాలు కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రీన్‌ క్లస్టర్లలోని పరిశ్రమలు, అగ్రి ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ కార్యకలాపాల్లో భౌతిక దూరం పాటించి ఆ మేరకు కార్యకలాపాలు ముందుకు సాగేలా చూడాలని సూచించారు. రైతు భరోసా, మత్స్యకార భరోసాలపై సీఎం సమీక్షించారు. లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో 2 వారాలపాటు ప్రదర్శించాలన్నారు.

కోల్డ్ స్టోరేజీలపై ప్రత్యేక దృష్టి

ఆక్వా ఉత్పత్తులను నిల్వచేయడానికి కోల్డ్‌ స్టోరేజీలపై దృష్టి పెట్టాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఫాం గేట్‌ వద్దే పంట కొనుగోలు పద్ధతిని సమర్థవంతగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆయిల్‌ పాం ధర తగ్గుదలపై దృష్టి పెట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ఇవ్వాలని చెప్పారు.

ఇదీ చదవండి:

కన్నా... కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్​?: విజయసాయి

cm ys jagan review on corona situations in the state
కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష

కొవిడ్‌ 19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణ, పరీక్షల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులపై చర్చించారు. కేసులు ఎక్కువగా నమోదవుతోన్న జిల్లాలు సహా అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఐసీయూ బెడ్లను పెంచాలని ఆదేశించారు. అవసరమైతే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న పట్టణాల్లోనే ఆస్పత్రులను గుర్తించి అక్కడే చికిత్స అందించాలని చెప్పారు.

కరోనా పరీక్షలపై ఆరా

రాష్ట్రంలో నిర్వహిస్తున్న కరోనా పరీక్షలపై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకూ 41 వేల 512 మందికి పరీక్షలు చేయగా.. నిన్న ఒక్కరోజే 5 వేల 757 పరీక్షలు చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రతి పది లక్షల జనాభాకు 830 మందికి పరీక్షలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రం నిలిచిందని సీఎంకు అధికారులు తెలిపారు. ట్రూనాట్‌ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని అధికారులు వివరించారు. దీనివల్ల 2 గంటల్లోగా ఫలితం వస్తోందని, తగిన చర్యలు తీసుకునేందుకు వీలవుతోందని చెప్పారు. క్వారంటైన్​ కేంద్రాల్లో ఉన్న వారందరికీ పరీక్షలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఆ కారణంతోనే కొరియా కిట్లు

ర్యాపిడ్‌ టెస్టు కిట్ల పనితీరుపై సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో ఇప్పటికే 6 వేల వరకు శాంపిళ్లను పరిశీలించామని... ఆ కిట్లు మంచి పనితీరు కనబరుస్తున్నాయని అధికారులు తెలిపారు. చైనా కిట్లు విక్రయించేందుకు గతంలో కొందరు రాష్ట్రానికి వచ్చారని.. వాటి పని తీరు సంతృప్తికరంగా లేదని తెలిపారు. ఈ కారణంతోనే చైనా కిట్లను కాకుండా కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. టెలీ మెడిసిన్‌లో 300 మంది డాక్టర్లు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. కాల్‌ చేసిన వారికి ప్రిస్క్రిప్షన్లతో పాటు మందులు కూడా అందించాలని సీఎం ఆదేశించారు.

కార్యకలాపాలు కొనసాగాలి

కొవిడ్‌ -19 నివారణ జాగ్రత్తలతో గ్రీన్‌ క్లస్టర్లలో కార్యకలాపాలు కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రీన్‌ క్లస్టర్లలోని పరిశ్రమలు, అగ్రి ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ కార్యకలాపాల్లో భౌతిక దూరం పాటించి ఆ మేరకు కార్యకలాపాలు ముందుకు సాగేలా చూడాలని సూచించారు. రైతు భరోసా, మత్స్యకార భరోసాలపై సీఎం సమీక్షించారు. లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో 2 వారాలపాటు ప్రదర్శించాలన్నారు.

కోల్డ్ స్టోరేజీలపై ప్రత్యేక దృష్టి

ఆక్వా ఉత్పత్తులను నిల్వచేయడానికి కోల్డ్‌ స్టోరేజీలపై దృష్టి పెట్టాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఫాం గేట్‌ వద్దే పంట కొనుగోలు పద్ధతిని సమర్థవంతగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆయిల్‌ పాం ధర తగ్గుదలపై దృష్టి పెట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ఇవ్వాలని చెప్పారు.

ఇదీ చదవండి:

కన్నా... కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్​?: విజయసాయి

Last Updated : Apr 23, 2020, 2:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.