అవినీతి నిరోధక శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, అనిశా చీఫ్ విశ్వజిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనిశా పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆశించిన రీతిలో పనితీరు కనిపించట్లేదని అన్నారు. మరింత చురుగ్గా, క్రియాశీలకంగా, అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. అనిశా లో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదన్నారు. నెల రోజుల తర్వాత మరోసారి సమీక్ష చేస్తానని వెల్లడించారు.
ఇవీ చదవండి: