ETV Bharat / city

జులై 8న ఉచిత ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ: సీఎం జగన్

author img

By

Published : Jun 23, 2020, 4:09 PM IST

Updated : Jun 23, 2020, 7:52 PM IST

జులై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమంగా దీన్ని చేపట్టాలని స్పష్టం చేశారు. సచివాలయం నుంచి స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. పాఠశాలల్లో నాడు నేడు పనులు పూర్తి, వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్​లు అంగన్వాడి కేంద్రాల నిర్మాణంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.

cm jagan conference with collectors and jagan
cm jagan conference with collectors and jagan

జులై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల ఇళ్ల పట్టాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నిర్దేశించిన తేదీనాటికి వందశాతం కచ్చితంగా ఇళ్లపట్టాల పంపిణీ పూర్తి కావాలని జగన్ పేర్కొన్నారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అన్నారు. కొవిడ్ తగ్గుముఖం పట్టిన అనంతరం గ్రామాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు. సరైన కారణం లేకుండా ఎవరికైనా ఇంటిపట్టా రాకపోతే సదరు అధికారులే బాధ్యులుగా ఉంటారని సీఎం హెచ్చరించారు. పెన్షన్ కార్డు, రేషన్ కార్డులను 10 రోజుల్లో, ఆరోగ్యశ్రీ కార్డును 20 రోజుల్లో, ఇంటిపట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందించాలని సూచించారు. గడువులోగా వ్యవస్థలను తయారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు.

ఇసుక నిల్వ చేయాలి

వర్షాకాలంలో పనుల కోసం 46.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిర్దేశించుకున్న 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాకాల సీజన్ ప్రారంభమైన దృష్ట్యా వచ్చే రెండు వారాలు మాత్రమే అందుబాటులో ఉంటుందని.. రీచ్​లు మునిగే అవకాశమున్న నేపథ్యంలో ఇప్పుడే ఇసుక నిల్వ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నదులు, వాగుల నుంచి ఎడ్ల బండ్లతో ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికి ప్రభుత్వం అనుమతించిందని.. త్వరలోనే ట్రాక్టర్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్​లు, అంగన్​వాడీ కేంద్రాల మీద పూర్తిగా కలెక్టర్లు ధ్యాస పెట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా 55 వేల అంగన్​వాడీ భవనాలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. జగనన్న పచ్చతోరణం కింద 6 కోట్ల మొక్కల్ని నాటాలి. పట్టణ ప్రాంతాల్లో వార్డు క్లినిక్స్‌, వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పేరిట నిర్మాణం చేపట్టాలి. ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం అవుతున్నందున వెంటనే నాడు-నేడు కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలి. ఆగస్టు 9న ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేసి.. గిరిజనులకు జీవనాధారం చూపించాలి.

-సీఎం జగన్

క్యూ ఆర్‌ కోడ్‌తో ఆరోగ్యశ్రీ కార్డులు

నాణ్యమైన ఎరువుల కోసం, పురుగు మందుల కోసం.. రైతులు ఆర్డర్‌ ఇవ్వగానే 48 గంటల్లోగా వాటిని డెలివరీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. 2018 రబీ పంటల బీమాకు సంబంధించిన రూ.596 కోట్ల బీమా డబ్బును జూన్‌ 26న చెల్లించబోతున్నట్టు సీఎం తెలిపారు. క్యూ ఆర్‌ కోడ్‌తో ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్‌ కాలేజీలను కొత్తగా నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాను చేయాలని ఆలోచన ఉన్నందున.. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలు ఉండేలా చూస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

'కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి జిల్లాలోనూ కనీసం 1500 బెడ్లు ఉండేలా చూడాలి. వచ్చే నెలలో 1060 కొత్త 108, 104 అంబులెన్సులు ప్రారంభిస్తాం. తోటపల్లి, పోలవరం, వెలిగొండ, గండికోట, చిత్రావతి బాలెన్సింగ్‌ రిజర్వాయర్లకు సంబంధించి మిగిలిపోయిన భూ సేకరణ, పునరావాస పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస పనులు చేపట్టాలి. 41.5 ఎత్తు వరకూ ఎక్కడా ముంపునకు గురి కాకుండా.. ప్రభావితమైన వారిని తరలించే కార్యక్రమాలు చేపట్టాలి' అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ఇదీ చదవండి: కరోనా ఉద్ధృతి పెరిగింది.. డిగ్రీ, వృత్తి విద్య పరీక్షలు రద్దు చేయండి: పవన్

జులై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల ఇళ్ల పట్టాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నిర్దేశించిన తేదీనాటికి వందశాతం కచ్చితంగా ఇళ్లపట్టాల పంపిణీ పూర్తి కావాలని జగన్ పేర్కొన్నారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అన్నారు. కొవిడ్ తగ్గుముఖం పట్టిన అనంతరం గ్రామాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు. సరైన కారణం లేకుండా ఎవరికైనా ఇంటిపట్టా రాకపోతే సదరు అధికారులే బాధ్యులుగా ఉంటారని సీఎం హెచ్చరించారు. పెన్షన్ కార్డు, రేషన్ కార్డులను 10 రోజుల్లో, ఆరోగ్యశ్రీ కార్డును 20 రోజుల్లో, ఇంటిపట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందించాలని సూచించారు. గడువులోగా వ్యవస్థలను తయారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు.

ఇసుక నిల్వ చేయాలి

వర్షాకాలంలో పనుల కోసం 46.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిర్దేశించుకున్న 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాకాల సీజన్ ప్రారంభమైన దృష్ట్యా వచ్చే రెండు వారాలు మాత్రమే అందుబాటులో ఉంటుందని.. రీచ్​లు మునిగే అవకాశమున్న నేపథ్యంలో ఇప్పుడే ఇసుక నిల్వ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నదులు, వాగుల నుంచి ఎడ్ల బండ్లతో ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికి ప్రభుత్వం అనుమతించిందని.. త్వరలోనే ట్రాక్టర్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్​లు, అంగన్​వాడీ కేంద్రాల మీద పూర్తిగా కలెక్టర్లు ధ్యాస పెట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా 55 వేల అంగన్​వాడీ భవనాలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. జగనన్న పచ్చతోరణం కింద 6 కోట్ల మొక్కల్ని నాటాలి. పట్టణ ప్రాంతాల్లో వార్డు క్లినిక్స్‌, వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పేరిట నిర్మాణం చేపట్టాలి. ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం అవుతున్నందున వెంటనే నాడు-నేడు కింద చేపట్టిన పనులు పూర్తి చేయాలి. ఆగస్టు 9న ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేసి.. గిరిజనులకు జీవనాధారం చూపించాలి.

-సీఎం జగన్

క్యూ ఆర్‌ కోడ్‌తో ఆరోగ్యశ్రీ కార్డులు

నాణ్యమైన ఎరువుల కోసం, పురుగు మందుల కోసం.. రైతులు ఆర్డర్‌ ఇవ్వగానే 48 గంటల్లోగా వాటిని డెలివరీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. 2018 రబీ పంటల బీమాకు సంబంధించిన రూ.596 కోట్ల బీమా డబ్బును జూన్‌ 26న చెల్లించబోతున్నట్టు సీఎం తెలిపారు. క్యూ ఆర్‌ కోడ్‌తో ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్‌ కాలేజీలను కొత్తగా నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాను చేయాలని ఆలోచన ఉన్నందున.. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలు ఉండేలా చూస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

'కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి జిల్లాలోనూ కనీసం 1500 బెడ్లు ఉండేలా చూడాలి. వచ్చే నెలలో 1060 కొత్త 108, 104 అంబులెన్సులు ప్రారంభిస్తాం. తోటపల్లి, పోలవరం, వెలిగొండ, గండికోట, చిత్రావతి బాలెన్సింగ్‌ రిజర్వాయర్లకు సంబంధించి మిగిలిపోయిన భూ సేకరణ, పునరావాస పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస పనులు చేపట్టాలి. 41.5 ఎత్తు వరకూ ఎక్కడా ముంపునకు గురి కాకుండా.. ప్రభావితమైన వారిని తరలించే కార్యక్రమాలు చేపట్టాలి' అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ఇదీ చదవండి: కరోనా ఉద్ధృతి పెరిగింది.. డిగ్రీ, వృత్తి విద్య పరీక్షలు రద్దు చేయండి: పవన్

Last Updated : Jun 23, 2020, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.