ETV Bharat / city

ఐఆర్​ఎస్ అధికారి కృష్ణ కిషోర్​పై కేసు నమోదు

author img

By

Published : Dec 16, 2019, 6:29 AM IST

ఇటీవలే సస్పెండ్ అయిన ఐఆర్​ఎస్ అధికారి కృష్ణ కిషోర్​పై సీఐడీ కేసు నమోదు చేసింది. ముందస్తు అనుమతి లేకుండా రూ.కోట్ల విలువైన ప్రకటనల జారీ, ఈడీబీలో ఉద్యోగాలు, ప్రజాధనం దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై కేసు నమోదైంది.

irs officer krishna kishore
కృష్ణ కిషోర్

రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీ ఈడీబీ) మాజీ సీఈఓ, ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్​పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈడీబీలో ఉండగా నిధులు దుర్వినియోగం చేయటంతో పాటు ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న అభియోగంపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈడీబీలోని ప్రత్యేక గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తులసీ రాణి చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 188, 120 బి, 409 ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. ఏపీ ఈడీబీ- 2018 చట్టం ప్రకారం కూడా ఎఫ్ఐఆర్లో సీఐడీ అభియోగాలు మోపారు. ఈడీబీలోని మాజీ అకౌంట్స్ అధికారి బి. శ్రీనివాసరావుపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈడీబీలో ఉద్యోగాలు, ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ కేసు చేశారన్న అభియోగాలను ఇరువురిపైనా సీఐడీ మోపింది.

సంబంధిత కథనం

రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీ ఈడీబీ) మాజీ సీఈఓ, ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్​పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈడీబీలో ఉండగా నిధులు దుర్వినియోగం చేయటంతో పాటు ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న అభియోగంపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈడీబీలోని ప్రత్యేక గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తులసీ రాణి చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 188, 120 బి, 409 ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. ఏపీ ఈడీబీ- 2018 చట్టం ప్రకారం కూడా ఎఫ్ఐఆర్లో సీఐడీ అభియోగాలు మోపారు. ఈడీబీలోని మాజీ అకౌంట్స్ అధికారి బి. శ్రీనివాసరావుపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈడీబీలో ఉద్యోగాలు, ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ కేసు చేశారన్న అభియోగాలను ఇరువురిపైనా సీఐడీ మోపింది.

సంబంధిత కథనం

ఐఆర్​ఎస్ అధికారి సస్పెండ్... అమరావతి విడిచి వెళ్లొద్దని ఆదేశాలు

Intro:Body:

AP_VJA_11_16_CID_registers_case_on_IRS_officer_av_3052784


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.