ETV Bharat / city

జలాల వినియోగం.. విభజన చట్టంపై సీఎంల సుదీర్ఘ చర్చ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌... హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలపై 4 గంటలకు పైగా చర్చించారు.

author img

By

Published : Sep 23, 2019, 9:49 PM IST

kcrjagan

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం హైదరాబాద్​లో ముగిసింది. ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. లోటస్‌ పాండ్‌ నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌కు కేసీఆర్‌ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలతో పాటు గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగంపై ఈ భేటీలో ముఖ్యమంత్రులు చర్చించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థలపై సమాలోచనలు చేశారు.

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆదాయ వనరుల సమీకరణ, కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రులు చర్చించారు. ఇద్దరు సీఎంల మధ్య తొలిసారిగా గత జూన్‌ 28న ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు రెండో తేదీన ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఇది మూడోసారి ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం హైదరాబాద్​లో ముగిసింది. ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. లోటస్‌ పాండ్‌ నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌కు కేసీఆర్‌ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలతో పాటు గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగంపై ఈ భేటీలో ముఖ్యమంత్రులు చర్చించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థలపై సమాలోచనలు చేశారు.

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆదాయ వనరుల సమీకరణ, కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రులు చర్చించారు. ఇద్దరు సీఎంల మధ్య తొలిసారిగా గత జూన్‌ 28న ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు రెండో తేదీన ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఇది మూడోసారి ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

ఒకే కార్డుపై ఆధార్​, పాస్​పోర్ట్, డ్రైవింగ్​ లైసెన్స్​!

Chennai, Sep 23 (ANI): While addressing a press conference in Chennai, Army Chief General Bipin Rawat on September 23 said, "There is a communication breakdown between terrorists in the Kashmir Valley and their handlers in Pakistan but there is no communication breakdown between people to people." "Pakistan violates ceasefire to push terrorists into our territory. We know how to deal with ceasefire violations. Our troops know how to position themselves and take action. We are alert and will ensure that maximum infiltration bids are foiled," he added. Earlier, Rawat attended 'Young Leaders Training Wing' program in the premises of the Officers Training Academy (OTA) in Chennai.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.