అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీవన్మృతురాలైన చరితారెడ్డి పార్థివదేహం హైదరాబాద్కు చేరుకుంది. తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న చరితారెడ్డి మృతదేహాన్ని నేరేడ్మెట్ రేణుకానగర్లోని నివాసానికి తరలించారు. డిసెంబరు 27న మిచిగావ్ ముస్కేగాన్లో రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్ కావటం వల్ల చరితారెడ్డి మృతి చెందింది.
చనిపోయినా బతికే ఉంది...!
చరితారెడ్డిని హైదరాబాద్ తరలించేందుకు అయ్యే ఖర్చుల కోసం ఆమె స్నేహితులు చేయీ చేయీ కలిపారు. ఫేస్బుక్లో ప్రత్యేక ఖాతాను తెరిచి క్రౌడ్ ఫండింగ్ చేశారు. కారు ప్రమాదంలో బ్రెయిన్డెడ్ కావటం వల్ల అవయవాలను కుటుంబసభ్యుల అంగీకారంతో తొమ్మిది మందికి దానం చేశారు. చరితారెడ్డి భౌతికంగా మృతిచెందినా తొమ్మిది మంది రూపంలో ఆమె బతికే ఉందంటున్నారు స్నేహితులు.
ఇవీ చూడండి: చనిపోయి కూడా తొమ్మిది మందికి జీవితాన్నిచ్చింది..