ETV Bharat / city

పరాకాష్ఠకు వైకాపా ప్రభుత్వ ఫ్యాక్షనిస్ట్ ధోరణి: చంద్రబాబు

author img

By

Published : Feb 9, 2020, 5:54 PM IST

Updated : Feb 9, 2020, 7:23 PM IST

పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఏ ఉద్యోగైనా సరే మూడు నెలలకు మించి నిరీక్షణ(వెయిటింగ్‌)లో ఉంటే... ఆ మొత్తం కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీనిపై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వమే వెయిటింగ్‌లో ఉంచి వాళ్లపై చర్యలు చేపట్టడం అమానవీయమని దుయ్యబట్టారు.

పరాకాష్ఠకు వైకాపా ప్రభుత్వ ఫ్యాక్షనిస్ట్ ధోరణి: చంద్రబాబు
పరాకాష్ఠకు వైకాపా ప్రభుత్వ ఫ్యాక్షనిస్ట్ ధోరణి: చంద్రబాబు
  • వైసిపిప్రభుత్వ ఫాక్షనిస్ట్ ధోరణి రానురానూ పరాకాష్టకు చేరుతోంది.ప్రతిపక్షాల నాయకులు,కార్యకర్తలపై కక్షసాధింపుతో వారి ఉన్మాదం చల్లారలేదు.రైతులు,రైతుకూలీలు,మహిళలు,యువత,కార్మికులు అన్నివర్గాల ప్రజలను అష్టకష్టాలుపెట్టి,ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే ఫాక్షనిస్ట్ పంజా విసిరింది(1/6)

    — N Chandrababu Naidu (@ncbn) February 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైకాపా ప్రభుత్వ ఫ్యాక్షనిస్ట్ ధోరణి రానురానూ పరాకాష్ఠకు చేరుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రైతులు, మహిళలు, కార్మికులు అన్ని వర్గాలను అష్టకష్టాలు పెట్టి... ఇప్పుడు ఉద్యోగులపైనే ప్రభుత్వం ఫ్యాక్షనిస్ట్ పంజా విసిరిందని విమర్శించారు. '3 నెలలకు మించి వెయిటింగ్‌లో ఉంటే ఉద్యోగులకు జీతం చెల్లించబోమని ఉత్తర్వులు ఇచ్చారు. 6 నెలలు దాటి వెయిటింగ్‌లో ఉంటే అసాధారణ సెలవుగా పరిగణిస్తామన్నారు. ఇవి ఉద్యోగులపై వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ఠ' అని చంద్రబాబు మండిపడ్డారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. పోస్టింగ్‌లు ఇవ్వకుండా పోలీసు అధికారులు, సిబ్బందిని గత 8 నెలలుగా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు జీతాలు కూడా ఇచ్చేది లేదని ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గ చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వెయిటింగ్‌లో ఉంటే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే వెయిటింగ్‌లో ఉంచి.. వాళ్లపై చర్యలు చేపట్టడం అమానవీయమని అన్నారు. 'ప్రభుత్వం తప్పు చేసి ఉద్యోగులను శిక్షించడం ఎక్కడైనా ఉందా?. ఎందుకు ఇంతమందిని 8 నెలలకుపైగా వెయిటింగ్‌లో పెట్టారు?. 3 నెలలు కాగానే ప్రభుత్వ సమీక్షకు ఎందుకు పంపలేదు?. ఇటువంటి దుర్మార్గ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్

  • వైసిపిప్రభుత్వ ఫాక్షనిస్ట్ ధోరణి రానురానూ పరాకాష్టకు చేరుతోంది.ప్రతిపక్షాల నాయకులు,కార్యకర్తలపై కక్షసాధింపుతో వారి ఉన్మాదం చల్లారలేదు.రైతులు,రైతుకూలీలు,మహిళలు,యువత,కార్మికులు అన్నివర్గాల ప్రజలను అష్టకష్టాలుపెట్టి,ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే ఫాక్షనిస్ట్ పంజా విసిరింది(1/6)

    — N Chandrababu Naidu (@ncbn) February 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైకాపా ప్రభుత్వ ఫ్యాక్షనిస్ట్ ధోరణి రానురానూ పరాకాష్ఠకు చేరుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రైతులు, మహిళలు, కార్మికులు అన్ని వర్గాలను అష్టకష్టాలు పెట్టి... ఇప్పుడు ఉద్యోగులపైనే ప్రభుత్వం ఫ్యాక్షనిస్ట్ పంజా విసిరిందని విమర్శించారు. '3 నెలలకు మించి వెయిటింగ్‌లో ఉంటే ఉద్యోగులకు జీతం చెల్లించబోమని ఉత్తర్వులు ఇచ్చారు. 6 నెలలు దాటి వెయిటింగ్‌లో ఉంటే అసాధారణ సెలవుగా పరిగణిస్తామన్నారు. ఇవి ఉద్యోగులపై వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ఠ' అని చంద్రబాబు మండిపడ్డారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. పోస్టింగ్‌లు ఇవ్వకుండా పోలీసు అధికారులు, సిబ్బందిని గత 8 నెలలుగా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు జీతాలు కూడా ఇచ్చేది లేదని ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గ చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వెయిటింగ్‌లో ఉంటే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే వెయిటింగ్‌లో ఉంచి.. వాళ్లపై చర్యలు చేపట్టడం అమానవీయమని అన్నారు. 'ప్రభుత్వం తప్పు చేసి ఉద్యోగులను శిక్షించడం ఎక్కడైనా ఉందా?. ఎందుకు ఇంతమందిని 8 నెలలకుపైగా వెయిటింగ్‌లో పెట్టారు?. 3 నెలలు కాగానే ప్రభుత్వ సమీక్షకు ఎందుకు పంపలేదు?. ఇటువంటి దుర్మార్గ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్

Last Updated : Feb 9, 2020, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.