హైదరాబాద్లో సీజీఎస్టీ సహాయ కమిషనర్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీని కేంద్ర ఆర్థికశాఖ సస్పెండ్ చేసింది. దీర్ఘకాలం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో పనిచేసిన శ్రీనివాస్.. వస్తుసేవల పన్ను ఎగవేత విభాగంలోనూ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తించారు. ఈడీ, జీఎస్టీలో పనిచేస్తున్న సమయంలో పలు కీలక కేసులను దర్యాప్తు చేశారు.
పన్ను ఎగవేత విభాగంలో పనిచేసిన సమయంలో బోగస్ సంస్థల పేరున నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఇన్పుట్ టాక్స్క్రెడిట్ పొందిన అభియోగంపై ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ సంస్థ ఎండీ శ్రీధర్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ. 5 కోట్లు డిమాండ్ చేసి రూ.10 లక్షలు లంచం తీసుకున్నట్లు 2019 సెప్టెంబరుతో బొల్లినేని శ్రీనివాస్పై సీబీఐ కేసు నమోదు చేసింది. అంతకు ముందు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపైనా కేసు నమోదయింది. ఈ కేసులు విచారణ జరుగుతుండగానే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ను కేంద్ర ఆర్థిక శాఖ ఈనెల 17న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకిరాగా.. అనుమతి లేకుండా హైదరాబాద్ వదిలి వెళ్లరాదని అందులో స్పష్టం చేసింది.
![cgst-assistant-commissioner-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10759903_dilip.jpg)