18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జూన్ 19న ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎన్నికలు గతంలోనే జరగాల్సి ఉండగా.. కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైకాపా నుంచి నలుగురు, తెదేపా నుంచి ఒకరు బరిలో ఉన్నారు. గుజరాత్- 4, మధ్యప్రదేశ్ 3, రాజస్థాన్ 3, ఝూర్ఖండ్-2, మణిపూర్- 1, మేఘాలయ- 1 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇదీ చదవండి