ETV Bharat / city

కొత్త ప్రాజెక్టులపై సమాచారం కోరిన కేంద్రం!

author img

By

Published : Jun 26, 2020, 10:14 AM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొత్త ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం అదనపు సమాచారాన్ని కోరినట్లు తెలిసింది. ఈ మేరకు గోదావరి, కృష్ణా బోర్డు ఛైర్మన్లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు.

telugu-states
telugu-states

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొత్త ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం అదనపు సమాచారాన్ని కోరినట్లు తెలిసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యు.పి.సింగ్‌ గురువారం కృష్ణా, గోదావరి బోర్డు ఛైర్మన్లతో మరోసారి దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు అడిగినా ఇంకా ఇవ్వలేదని, ఈ ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని సూచించినా ఎలాంటి సమాధానం లేదని రెండురోజుల క్రితం అధికారులు జల్‌శక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

తాజాగా ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేదా అని కేంద్ర కార్యదర్శి.. ఆయా బోర్డుల ఛైర్మన్లను అడిగినట్లు తెలిసింది. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అనుమతుల్లో ఏమి వచ్చాయి, ఇంకా రావాల్సినవి ఎన్ని ఉన్నాయి తదితర వివరాలను పంపాలని సూచించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొత్త ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం అదనపు సమాచారాన్ని కోరినట్లు తెలిసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యు.పి.సింగ్‌ గురువారం కృష్ణా, గోదావరి బోర్డు ఛైర్మన్లతో మరోసారి దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు అడిగినా ఇంకా ఇవ్వలేదని, ఈ ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని సూచించినా ఎలాంటి సమాధానం లేదని రెండురోజుల క్రితం అధికారులు జల్‌శక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

తాజాగా ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేదా అని కేంద్ర కార్యదర్శి.. ఆయా బోర్డుల ఛైర్మన్లను అడిగినట్లు తెలిసింది. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అనుమతుల్లో ఏమి వచ్చాయి, ఇంకా రావాల్సినవి ఎన్ని ఉన్నాయి తదితర వివరాలను పంపాలని సూచించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.