ETV Bharat / city

Somu Veerraju on Capital City: జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవు గానీ..అభివృద్ధి వికేంద్రీకరణా ?: సోము వీర్రాజు

author img

By

Published : Nov 23, 2021, 6:51 PM IST

అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటించాలని..ఇది భాజపా విధానమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju on capital city) అన్నారు. ఈ విషయంలో అనవసరపు గందరగోళానికి తావివ్వొద్దని.. సీఎం జగన్‌కు సూచించారు. జీతాలివ్వడానికే డబ్బులేని ప్రభుత్వం..3 రాజధానులు కడతామంటే ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు.

bjp state president somu veerraju
సోము వీర్రాజు

న్యాయస్థానం నుంచి తప్పించుకునేందుకే మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju fire on ycp government over capital city) అన్నారు. అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డికి చిత్తశుద్ధి లేదని అన్నారు. అసత్యాలు, బూతులు మాట్లాడేందుకు శాసనసభను వేదికగా చేసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. రాయలసీమపై జగన్‌కు ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చిందా ? అని ప్రశ్నించారు.

ఈ రెండున్నరేళ్ల కాలంలో సీమకు చెందిన తెలుగుగంగ, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు. వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయా ? అని ప్రశ్నించారు. జీతాలు చెల్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని.. ఇంకా వికేంద్రీకరణతో అభివృద్ధి చేస్తామని ఎలా చెబుతారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అనంతపురం, కర్నూలు, తిరుపతి, విశాఖలో విద్యాలయాలు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు.

జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవుగానీ..అభివృద్ధి వికేంద్రీకరణా ?

"అమరావతి రాజధాని విషయంలో సీఎంకు చిత్తశుద్ధి లేదు. రాజధాని అమరావతిపై జగన్‌ ఏమన్నారో ఆలోచించుకోవాలి. సీఎం పదవిలో ఉన్న జగన్‌..అసత్యాలు చెప్పడం సరికాదు. రాయలసీమపై ఎక్కడ లేని ప్రేమ జగన్‌కు ఇప్పుడే పుట్టిందా ?. అంత ప్రేమ ఉంటే ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయట్లేదు. జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవుగానీ.. అభివృద్ధి వికేంద్రీకరణా ?. మూడు రాజధానుల నిర్మాణానికి సీఎం జగన్‌ వద్ద అంత డబ్బు ఉందా ?. రూ.2 వేల కోట్లతో రహదారులు నిర్మించలేకపోతున్నారు. 151 సీట్లు ఇస్తే ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా ?. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు" - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి

AMARAVATI INCIDENTS: అమరావతి బిల్లు నుంచి 3 రాజధానుల ఉపసంహరణ వరకు.. అసలేంజరిగిందంటే ?

న్యాయస్థానం నుంచి తప్పించుకునేందుకే మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju fire on ycp government over capital city) అన్నారు. అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డికి చిత్తశుద్ధి లేదని అన్నారు. అసత్యాలు, బూతులు మాట్లాడేందుకు శాసనసభను వేదికగా చేసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. రాయలసీమపై జగన్‌కు ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చిందా ? అని ప్రశ్నించారు.

ఈ రెండున్నరేళ్ల కాలంలో సీమకు చెందిన తెలుగుగంగ, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు. వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయా ? అని ప్రశ్నించారు. జీతాలు చెల్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని.. ఇంకా వికేంద్రీకరణతో అభివృద్ధి చేస్తామని ఎలా చెబుతారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అనంతపురం, కర్నూలు, తిరుపతి, విశాఖలో విద్యాలయాలు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు.

జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవుగానీ..అభివృద్ధి వికేంద్రీకరణా ?

"అమరావతి రాజధాని విషయంలో సీఎంకు చిత్తశుద్ధి లేదు. రాజధాని అమరావతిపై జగన్‌ ఏమన్నారో ఆలోచించుకోవాలి. సీఎం పదవిలో ఉన్న జగన్‌..అసత్యాలు చెప్పడం సరికాదు. రాయలసీమపై ఎక్కడ లేని ప్రేమ జగన్‌కు ఇప్పుడే పుట్టిందా ?. అంత ప్రేమ ఉంటే ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయట్లేదు. జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవుగానీ.. అభివృద్ధి వికేంద్రీకరణా ?. మూడు రాజధానుల నిర్మాణానికి సీఎం జగన్‌ వద్ద అంత డబ్బు ఉందా ?. రూ.2 వేల కోట్లతో రహదారులు నిర్మించలేకపోతున్నారు. 151 సీట్లు ఇస్తే ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా ?. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు" - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి

AMARAVATI INCIDENTS: అమరావతి బిల్లు నుంచి 3 రాజధానుల ఉపసంహరణ వరకు.. అసలేంజరిగిందంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.