ETV Bharat / city

కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ

author img

By

Published : Sep 18, 2020, 10:53 AM IST

Updated : Sep 18, 2020, 12:26 PM IST

ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలపై హోంశాఖ జోక్యం చేసుకోవాలని భాజపా ఎంపీలు జీవీఎల్, సీఎం రమేశ్ కోరారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

cm ramesh letter to amit shah
cm ramesh letter to amit shah

కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాకు భాజపా ఎంపీలు జీవీఎల్, సీఎం రమేశ్ లేఖ రాశారు. ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలపై హోంశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ లేకుండా పోయిందని లేఖలో ప్రస్తావించారు. హిందువులే లక్ష్యంగా అనేక ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర పోలీసులు ఏం చేశారు...?

కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ

ఏపీలో వైకాపా ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే ఓ విధంగా స్పందిస్తోంది. ఇతర ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగితే మరోలా స్పందిస్తోంది. చర్చిపై రాళ్లు విసిరారని 41 మందిని అరెస్టు చేశారు. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మతిస్థిమితం లేనివాళ్ల చర్య అంటున్నారు. అంతర్వేది ఘటనపై సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారు. సీబీఐకి కేసు ఇచ్చేలోపు రాష్ట్ర పోలీసులు ఏం చేశారు?- జీవీఎల్, ఎంపీ

ప్రజాప్రతినిధులను విడుదల చేయాలి..

'తిరుమల బస్సు టికెట్లపై మత ప్రచారంతో ప్రభుత్వ వైఖరి బయటపడింది. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంది. భాజపా నేతలు, హిందువులు నిరసన చేపడితే అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసిన ప్రజాప్రతినిధులను విడుదల చేయాలి'- సీఎం రమేశ్, ఎంపీ

ఇదీ చదవండి

అరెస్టులు, నిర్బంధాలతో మా పోరాటాన్ని ఆపలేరు: సీఎం రమేశ్

కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాకు భాజపా ఎంపీలు జీవీఎల్, సీఎం రమేశ్ లేఖ రాశారు. ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలపై హోంశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ లేకుండా పోయిందని లేఖలో ప్రస్తావించారు. హిందువులే లక్ష్యంగా అనేక ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర పోలీసులు ఏం చేశారు...?

కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ

ఏపీలో వైకాపా ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే ఓ విధంగా స్పందిస్తోంది. ఇతర ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగితే మరోలా స్పందిస్తోంది. చర్చిపై రాళ్లు విసిరారని 41 మందిని అరెస్టు చేశారు. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మతిస్థిమితం లేనివాళ్ల చర్య అంటున్నారు. అంతర్వేది ఘటనపై సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారు. సీబీఐకి కేసు ఇచ్చేలోపు రాష్ట్ర పోలీసులు ఏం చేశారు?- జీవీఎల్, ఎంపీ

ప్రజాప్రతినిధులను విడుదల చేయాలి..

'తిరుమల బస్సు టికెట్లపై మత ప్రచారంతో ప్రభుత్వ వైఖరి బయటపడింది. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంది. భాజపా నేతలు, హిందువులు నిరసన చేపడితే అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసిన ప్రజాప్రతినిధులను విడుదల చేయాలి'- సీఎం రమేశ్, ఎంపీ

ఇదీ చదవండి

అరెస్టులు, నిర్బంధాలతో మా పోరాటాన్ని ఆపలేరు: సీఎం రమేశ్

Last Updated : Sep 18, 2020, 12:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.