ETV Bharat / city

MINOR RESCUED: పని ఇప్పిస్తానని మోసం.. మైనర్​తో వ్యభిచారం

author img

By

Published : Oct 11, 2021, 5:23 PM IST

పని ఇప్పిస్తానని చెప్పి ఓ మైనర్ బాలికతో వ్యభిచారం (minor girl rescued) చేయిస్తున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ రాయల్ ​కాలనీలో చోటు చేసుకుంది.

పని ఇప్పిస్తానని మైనర్ బాలికతో వ్యభిచారం
పని ఇప్పిస్తానని మైనర్ బాలికతో వ్యభిచారం

మైనర్‌ బాలికతో వ్యభిచారం (Minor Girl Prostitution) చేయిస్తున్న భార్యాభర్తలతో పాటు ఓ విటుడిని బాలాపూర్ పోలీసులు (Balapur Police) అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని రాయల్ ​కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం (Prostitution) జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఏహెచ్​టీయూ, పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు.

వ్యభిచార కూపం నుంచి బిహార్​ రాష్ట్రానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ ​బాలికకు (minor girl rescued) విముక్తి కలిగించారు. వ్యభిచార ముఠాలోని ముగ్గురు నిర్వాహకుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. వీరితో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్న బాలాపూర్ ​పోలీసులు... రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.2,420 నగదుతో పాటు మూడు సెల్​ఫోన్లు, 6 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

పనిపేరుతో కూపంలో దించి...

బాలాపూర్ ​రాయల్​ కాలనీకి చెందిన రెహానా బేగం, సయ్యద్​ అబూబకర్ భార్యభర్తలు. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో రెహానా బేగం, సయ్యద్ ​అబూబాకర్ తన స్నేహితురాలు సల్మాబేగంతో కలిసి వ్యభిచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం చాంద్రాయణగుట్ట నుంచి రాయల్ ​కాలనీకి రెహానా బేగం మకాం మార్చింది. చాంద్రాయణగుట్టలో ఉంటున్న సమయంలో పక్కింటికి చెందిన 17 సంవత్సరాల బాలిక ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించాలంటూ రెహానాబేగంను కోరింది.

సగం... సగం...

ఇదే అదనుగా భావించి.. ఆ మైనర్​బాలికకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి (Minor Girl Prostitution) దింపింది. ఆ తర్వాత రెహానాబేగం.. ఒక్కొక్క విటుడి నుంచి రూ. 2వేలు వసూలు చేస్తూ వాటిలో సగం డబ్బులు బాలికకు ఇస్తూ వస్తోంది. వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న బాలాపూర్ ​పోలీసులు ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించారు. అనంతరం రెడ్​హ్యాండెడ్‌గా పట్టుకొని వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు.

మైనర్ ​బాలికను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న రెహానా బేగం, సయ్యద్​ అబూబకర్ అరెస్ట్ అవ్వగా మరొకరు పరారీలో ఉన్నారు. ఓ విటుడు​ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:

Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 310 కరోనా కేసులు.. 2 మరణాలు

మైనర్‌ బాలికతో వ్యభిచారం (Minor Girl Prostitution) చేయిస్తున్న భార్యాభర్తలతో పాటు ఓ విటుడిని బాలాపూర్ పోలీసులు (Balapur Police) అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని రాయల్ ​కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం (Prostitution) జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఏహెచ్​టీయూ, పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు.

వ్యభిచార కూపం నుంచి బిహార్​ రాష్ట్రానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ ​బాలికకు (minor girl rescued) విముక్తి కలిగించారు. వ్యభిచార ముఠాలోని ముగ్గురు నిర్వాహకుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. వీరితో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్న బాలాపూర్ ​పోలీసులు... రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.2,420 నగదుతో పాటు మూడు సెల్​ఫోన్లు, 6 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

పనిపేరుతో కూపంలో దించి...

బాలాపూర్ ​రాయల్​ కాలనీకి చెందిన రెహానా బేగం, సయ్యద్​ అబూబకర్ భార్యభర్తలు. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో రెహానా బేగం, సయ్యద్ ​అబూబాకర్ తన స్నేహితురాలు సల్మాబేగంతో కలిసి వ్యభిచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం చాంద్రాయణగుట్ట నుంచి రాయల్ ​కాలనీకి రెహానా బేగం మకాం మార్చింది. చాంద్రాయణగుట్టలో ఉంటున్న సమయంలో పక్కింటికి చెందిన 17 సంవత్సరాల బాలిక ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించాలంటూ రెహానాబేగంను కోరింది.

సగం... సగం...

ఇదే అదనుగా భావించి.. ఆ మైనర్​బాలికకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి (Minor Girl Prostitution) దింపింది. ఆ తర్వాత రెహానాబేగం.. ఒక్కొక్క విటుడి నుంచి రూ. 2వేలు వసూలు చేస్తూ వాటిలో సగం డబ్బులు బాలికకు ఇస్తూ వస్తోంది. వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న బాలాపూర్ ​పోలీసులు ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించారు. అనంతరం రెడ్​హ్యాండెడ్‌గా పట్టుకొని వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు.

మైనర్ ​బాలికను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న రెహానా బేగం, సయ్యద్​ అబూబకర్ అరెస్ట్ అవ్వగా మరొకరు పరారీలో ఉన్నారు. ఓ విటుడు​ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:

Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 310 కరోనా కేసులు.. 2 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.