- మమ్మల్ని అవమానిస్తున్నారు.. ప్రభుత్వ వైఖరి మారకపోతే ఉద్యమిస్తాం: ఉద్యోగ సంఘాల నేతలు
పీఆర్సీపై ఆర్థికశాఖ అధికారులతో జరిగిన భేటీలో ఎలాంటి పురోగతి కనిపించలేదని ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీఎన్జీవో, ఏపీ రెవెన్యూ తదితర సంఘాలతో అధికారుల భేటీ నిర్వహించినప్పటికీ.. సమస్య కొలిక్కి రాలేదని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Peddireddy On Pensions: జనవరి నుంచి పింఛను లబ్ధిదారులకు రూ.2,500 పంపిణీ: మంత్రి పెద్దిరెడ్డి
జనవరి నుంచి పింఛను లబ్ధిదారులకు రూ.2,500 పంపిణీ చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1,570.60 కోట్లు విడుదల చేసిందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- HIGH COURT: రామతీర్థం ఘటన ఎఫ్ఐఆర్పై తదుపరి చర్యలు వద్దు: హైకోర్టు
రామతీర్థం ఘటనలో కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో ఉద్రిక్తతపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Atchenna Fire On Jagan: నేనెప్పుడూ ఇలాంటి ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని చూడలేదు: అచ్చెన్న
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన కొనసాగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. సినిమా రంగంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ నగరాల్లో ఆందోళనకరంగా కరోనా 'ఆర్-వ్యాల్యూ'
దేశంలో దిల్లీ, ముంబయి సహా పలు ప్రధాన నగారాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దిల్లీ, ముంబయిలో వైరస్ వ్యాప్తి వేగాన్ని సూచించే ఆర్-వ్యాల్యూ 2 దాటినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జవాన్ల ఫైరింగ్ ప్రాక్టీస్- కి.మీ దూరంలో ఉన్న బాలుడి తలలోకి తూటా!
సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. అనుకోకుండా ఓ 11 ఏళ్ల బాలుడి తలకు తూటా తగిలింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రఫేల్కు పోటీగా చైనా జెట్లు కొన్న పాక్
భారత్ అత్యంత శక్తిమంతమైన రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం చూసి ఓర్వలేకపోతోంది పాకిస్థాన్. అందుకే మనకు పోటీగా చైనా నుంచి J-10C యుద్ధ విమానాలను కొంటోంది. మార్చి 23న పాకిస్థాన్ డే వేడుకల్లో ఇవి తమకు అందుతాయని పాక్ హోంమంత్రి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IND VS SA: తొలి టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా శుభారంభం చేసింది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మూడు టెస్టుల సిరీస్లో 1-0తేడాతో ఆధిక్యంలో నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీమ్ఇండియా ప్లేయర్లకు ఏమైంది?.. ఆ రేసులోనూ లేరే
ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డుకు నలుగురు ఆటగాళ్లు నామినేట్ అయ్యారు. అంతకుముందు ప్రకటించిన టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అవ్వని టీమ్ఇండియా ప్లేయర్లూ ఈ రేసులోనూ లేకపోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'స్క్విడ్ గేమ్' వెబ్ సిరీస్.. త్వరలో మరో రెండు సీజన్లు
ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ సిరీస్కు మరో రెండు సీజన్లు కూడా సిద్ధమవుతున్నాయని డైరెక్టర్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.