RTC Strike: ఆంధ్రప్రదేశ్ ప్రజారవాణా శాఖ (ఏపీపీటీడీ) ఉద్యోగులు ఏ క్షణంలోనైనా సమ్మెకు దిగనున్నారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు విజయవాడలో మంగళవారం అందజేశారు. పీఆర్సీ సాధన సమితి నాయకులు పిలుపునిచ్చిన వెంటనే సమ్మెలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు ప్రకటించారు. ప్రస్తుత రివర్స్ పీఆర్సీ వల్ల ఎక్కువగా నష్టపోయేది తామేనని వాపోయారు.
ఇదీ చదవండి: Employees chalo vijayawada: రంగంలోకి పోలీసులు.. ఉద్యోగ సంఘాల నేతల గృహ నిర్బంధం.!