ETV Bharat / city

ముఖ్యమంత్రి జగన్​ను కలిసిన ఐఏఎస్ ఆదిత్యనాథ్‌

author img

By

Published : Dec 23, 2020, 11:52 AM IST

ముఖ్యమంత్రి జగన్​ను రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనను సీఎస్​గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

CM jagan
CM jagan

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి జగన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో సీఎం జగన్​కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతన సీఎస్ వెంట డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఉన్నారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆదిత్యనాథ్‌దాస్‌ సర్వీసు మరో ఆరు నెలలు?

కొత్త సీఎస్‌గా నియమితులైన ఆదిత్యనాథ్‌దాస్‌ సొంత రాష్ట్రం బిహార్‌. 1961 జూన్‌ 30న జన్మించారు. ఆయన 2021 జూన్‌ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే... ఆయన సర్వీసును కేంద్ర ప్రభుత్వం గరిష్ఠంగా మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉంది. ఐఏఎస్‌ అధికారిగా ఆదిత్యనాథ్‌దాస్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజన తర్వాత పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. నీటిపారుదల శాఖ బాధ్యతల్ని ఎక్కువ కాలం చూశారు.

ఐఏఎస్‌ శిక్షణ పూర్తి చేసుకున్నాక... మొదట విజయనగరం జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన నంద్యాల, విజయవాడల్లో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, నెల్లూరు డీఆర్‌డీఏ పీడీగా, హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌గా, కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, కేంద్ర ప్రభుత్వంలో డిప్యూటీ డైరెక్టర్‌ హోదాలో, వరంగల్‌ కలెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా, దిల్లీలో ఏపీ భవన్‌ అదనపు కమిషనర్‌గా, పురపాలక శాఖ కమిషనర్‌, డైరెక్టర్‌గా పనిచేశారు.

ఇదీ చదవండి:

అనపర్తిలో వేడెక్కిన రాజకీయం.. నేతల సవాళ్లతో పోలీసులు అప్రమత్తం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి జగన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో సీఎం జగన్​కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతన సీఎస్ వెంట డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఉన్నారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆదిత్యనాథ్‌దాస్‌ సర్వీసు మరో ఆరు నెలలు?

కొత్త సీఎస్‌గా నియమితులైన ఆదిత్యనాథ్‌దాస్‌ సొంత రాష్ట్రం బిహార్‌. 1961 జూన్‌ 30న జన్మించారు. ఆయన 2021 జూన్‌ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే... ఆయన సర్వీసును కేంద్ర ప్రభుత్వం గరిష్ఠంగా మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉంది. ఐఏఎస్‌ అధికారిగా ఆదిత్యనాథ్‌దాస్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజన తర్వాత పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. నీటిపారుదల శాఖ బాధ్యతల్ని ఎక్కువ కాలం చూశారు.

ఐఏఎస్‌ శిక్షణ పూర్తి చేసుకున్నాక... మొదట విజయనగరం జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన నంద్యాల, విజయవాడల్లో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, నెల్లూరు డీఆర్‌డీఏ పీడీగా, హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌గా, కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, కేంద్ర ప్రభుత్వంలో డిప్యూటీ డైరెక్టర్‌ హోదాలో, వరంగల్‌ కలెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా, దిల్లీలో ఏపీ భవన్‌ అదనపు కమిషనర్‌గా, పురపాలక శాఖ కమిషనర్‌, డైరెక్టర్‌గా పనిచేశారు.

ఇదీ చదవండి:

అనపర్తిలో వేడెక్కిన రాజకీయం.. నేతల సవాళ్లతో పోలీసులు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.