ETV Bharat / city

'4లక్షల ఉద్యోగాలంటూ.. 10 లక్షల ఉద్యోగాలకు గండి'

ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం నిర్ణయంతో అన్నక్యాంటీన్లలో పని చేస్తున్న సామాన్యులకు ఉపాధి లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 6, 2019, 6:26 PM IST

'4లక్షల ఉద్యోగాలు అంటూ 10లక్షల ఉద్యోగాలకు గండి'

రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన అని చెప్తూనే 10 లక్షల మంది ఉపాధికి గండి కొట్టారని తెదేపా జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ మండిపడ్డారు. జగన్‌ మోకాలి నిర్ణయాలతో పేదల నోటికి అందే కూడు పోవడమే కాకుండా అన్న క్యాంటీన్లలో పనిచేస్తున్న సామాన్యులకు ఉపాధి లేకుండా చేశారని దుయ్యబట్టారు. వైకాపా కార్యకర్తలపై ఉన్న ప్రేమ, సామాన్యులపై లేదా అని నిలదీశారు. భవిష్యత్తు ప్రశ్నార్థకమై రావాలి జగన్, కావాలి జగన్ అంటూ గోపాల మిత్రలు అర్ద నగ్నంగా రోడ్డెక్కుతున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. ఇలా చేస్తుంటే జగన్​కు చీమ కుట్టినట్లైనా లేదా అంటూ ప్రశ్నించారు. గోపాలమిత్రల ఆందోళనకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

'4లక్షల ఉద్యోగాలు అంటూ 10లక్షల ఉద్యోగాలకు గండి'
'4లక్షల ఉద్యోగాలు అంటూ 10లక్షల ఉద్యోగాలకు గండి'

రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన అని చెప్తూనే 10 లక్షల మంది ఉపాధికి గండి కొట్టారని తెదేపా జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ మండిపడ్డారు. జగన్‌ మోకాలి నిర్ణయాలతో పేదల నోటికి అందే కూడు పోవడమే కాకుండా అన్న క్యాంటీన్లలో పనిచేస్తున్న సామాన్యులకు ఉపాధి లేకుండా చేశారని దుయ్యబట్టారు. వైకాపా కార్యకర్తలపై ఉన్న ప్రేమ, సామాన్యులపై లేదా అని నిలదీశారు. భవిష్యత్తు ప్రశ్నార్థకమై రావాలి జగన్, కావాలి జగన్ అంటూ గోపాల మిత్రలు అర్ద నగ్నంగా రోడ్డెక్కుతున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. ఇలా చేస్తుంటే జగన్​కు చీమ కుట్టినట్లైనా లేదా అంటూ ప్రశ్నించారు. గోపాలమిత్రల ఆందోళనకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

'4లక్షల ఉద్యోగాలు అంటూ 10లక్షల ఉద్యోగాలకు గండి'
'4లక్షల ఉద్యోగాలు అంటూ 10లక్షల ఉద్యోగాలకు గండి'
Intro:ap_knl_52_11_accident_overall_ab_c5

s.sudhakar, dhone.


కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి జాతీయ రహదారి కూడలిలో ఎస్ ఆర్ ఎస్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి తుఫాన్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ద్విచక్ర వాహన0 బస్సుకు అడ్డం రావడంతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అవతల రోడ్డున వెళుతున్న తుఫాన్ వాహనాన్ని ఢీ కొట్టింది. తుఫాన్ వాహనంలో 14 మంది గుంతకల్లులో పెళ్లి చూపులకు వెళ్లి తిరిగి గద్వాలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది వీరందరూ తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా రామాపురం గ్రామానికి చెందినవారు వీరిలో 13మంది అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఇద్దరు వ్యక్తులు, తుఫాన్ వాహనంలోని వ్యక్తిని మొత్తం ముగ్గురిని పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు అక్కడ ఇద్దరు మృతి చెందారు. బైకు వెళుతున్న వ్యక్తులు వెల్దుర్తి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. మొత్తం 15 మంది మృతి చెందారు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో బైకు, తుఫాన్ వాహనము నుజ్జు నుజ్జు అయ్యాయి. బస్సు ముందు భాగం మాత్రమే దెబ్బతిన్నందువల్ల బస్సులో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.


బైట్.

జహంగీర్,
రామాపురం వాసి.


Body:ఘోర రోడ్డు ప్రమాదం


Conclusion:kit no.692, cell no.9394450169.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.