ETV Bharat / city

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు అనుకూల పరిస్థితుల్లేవు

author img

By

Published : Dec 2, 2020, 6:01 AM IST

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అనుకూల పరిస్థితులు లేవని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటనను ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఎస్​ఈసీ చర్యలను నిలిపివేయాలంటూ పంచాయతీరాజ్​శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చలేమని వ్యాజ్యంలో ప్రభుత్వం పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సహా ప్రభుత్వ అభిప్రాయానికి విరుద్ధంగా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎస్​ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని హైకోర్టుకు తెలిపారు.

local body election
local body election

ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ.... రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 17న చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం వ్యాజ్యం వేసింది. ఎన్నికల సంఘం చర్యలను నిలిపివేయించాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పిటిషన్ వేశారు. కరోనా తీవ్రత సహా మరికొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పునరాలోచించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ఎన్నికల సంఘం కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చారు. ఈ ఏడాది మార్చి 18న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సహా ప్రభుత్వ అభిప్రాయానికి విరుద్ధంగా.... ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎస్​ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎన్నికలను 6 వారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పుడూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని ధర్మాసనానికి నివేదించారు. ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసిందని అయితే అప్పటికే ఎన్నికలు వాయిదా వేసినందున తదుపరి నోటిఫికేషన్ జారీకి ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీం ఆదేశించిందని వివరించారు.

ఏపీని బిహార్, రాజస్థాన్​తో పోల్చలేం

ఎన్నికల నిర్వహణ కోసం ఏపీని బిహార్, రాజస్థాన్‌తో పోల్చిచూడటం సరికాదన్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయికి చేరిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. నవంబర్ 29 నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 67వేల 638కి చేరిందని రోజుకు సగటున వెయ్యి కొత్త కేసులు వస్తున్నాయని తెలిపారు. దేశంలో పాజిటివ్ రేటు 6.73 శాతంగా ఉంటే అంతకన్నా అధికంగా రాష్ట్రంలో 8.66 శాతంగా ఉందన్నారు. రాష్ట్ర యంత్రాంగం మొత్తం కరోనా వ్యాప్తి నివారణ , కేసుల్ని కనుగొనడం, వైద్య సేవలు అందించే చర్చల్లో నిమగ్నమైందని నివేదించారు. పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళ తర్వాత ఏపీ మూడో పెద్ద రాష్ట్రంగా ఉందన్నారు. రాష్ట్ర యంత్రాంగం కరోనా వ్యాప్తి నివారణ, వైద్య సేవల చర్చల్లో నిమగ్నమైందని ధర్మాసనానికి నివేదించారు.

ఎస్​ఈసీ అలా చెప్పడం సరికాదు

ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయం కోసం ఎన్నికల సంఘం ఆగస్టు 24న సీఎస్‌కు లేఖరాసిందని పిటిషన్‌లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. అదేనెల 28న కరోనా విషయంలో తీసుకుంటున్న వివిధ చర్యలపై ఎస్​ఈసీకి సీఎస్ ప్రత్యుత్తరం పంపినట్లు తెలిపారు. సాధరణ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ప్రభుత్వం వెంటనే ఎన్నికల సంసిద్ధతపై ఎస్​ఈసీకి తెలియజేస్తుందన్నారు. ఎన్నికలకు రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నాయని ఎస్​ఈసీ చెప్పడం సరికాదని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.

ఆ ప్రకటన చట్టవిరుద్ధమని ప్రకటించండి

రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు కరోనా చికిత్స, నివారణలో నిపుణులు కాదంది. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంది. ఇప్పటికే 11 వేల 223 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని ప్రభుత్వం ధర్మాసనానికి నివేదించింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం నవంబర్ 17న జారీచేసిన ప్రకటనను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని ప్రభుత్వం కోరింది.

ఇదీ చదవండి : నేడు ఏపీ - అమూల్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శ్రీకారం

ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ.... రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 17న చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం వ్యాజ్యం వేసింది. ఎన్నికల సంఘం చర్యలను నిలిపివేయించాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పిటిషన్ వేశారు. కరోనా తీవ్రత సహా మరికొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పునరాలోచించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ఎన్నికల సంఘం కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చారు. ఈ ఏడాది మార్చి 18న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సహా ప్రభుత్వ అభిప్రాయానికి విరుద్ధంగా.... ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎస్​ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎన్నికలను 6 వారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పుడూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని ధర్మాసనానికి నివేదించారు. ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసిందని అయితే అప్పటికే ఎన్నికలు వాయిదా వేసినందున తదుపరి నోటిఫికేషన్ జారీకి ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీం ఆదేశించిందని వివరించారు.

ఏపీని బిహార్, రాజస్థాన్​తో పోల్చలేం

ఎన్నికల నిర్వహణ కోసం ఏపీని బిహార్, రాజస్థాన్‌తో పోల్చిచూడటం సరికాదన్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయికి చేరిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. నవంబర్ 29 నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 67వేల 638కి చేరిందని రోజుకు సగటున వెయ్యి కొత్త కేసులు వస్తున్నాయని తెలిపారు. దేశంలో పాజిటివ్ రేటు 6.73 శాతంగా ఉంటే అంతకన్నా అధికంగా రాష్ట్రంలో 8.66 శాతంగా ఉందన్నారు. రాష్ట్ర యంత్రాంగం మొత్తం కరోనా వ్యాప్తి నివారణ , కేసుల్ని కనుగొనడం, వైద్య సేవలు అందించే చర్చల్లో నిమగ్నమైందని నివేదించారు. పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళ తర్వాత ఏపీ మూడో పెద్ద రాష్ట్రంగా ఉందన్నారు. రాష్ట్ర యంత్రాంగం కరోనా వ్యాప్తి నివారణ, వైద్య సేవల చర్చల్లో నిమగ్నమైందని ధర్మాసనానికి నివేదించారు.

ఎస్​ఈసీ అలా చెప్పడం సరికాదు

ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయం కోసం ఎన్నికల సంఘం ఆగస్టు 24న సీఎస్‌కు లేఖరాసిందని పిటిషన్‌లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. అదేనెల 28న కరోనా విషయంలో తీసుకుంటున్న వివిధ చర్యలపై ఎస్​ఈసీకి సీఎస్ ప్రత్యుత్తరం పంపినట్లు తెలిపారు. సాధరణ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ప్రభుత్వం వెంటనే ఎన్నికల సంసిద్ధతపై ఎస్​ఈసీకి తెలియజేస్తుందన్నారు. ఎన్నికలకు రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నాయని ఎస్​ఈసీ చెప్పడం సరికాదని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.

ఆ ప్రకటన చట్టవిరుద్ధమని ప్రకటించండి

రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు కరోనా చికిత్స, నివారణలో నిపుణులు కాదంది. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంది. ఇప్పటికే 11 వేల 223 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని ప్రభుత్వం ధర్మాసనానికి నివేదించింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం నవంబర్ 17న జారీచేసిన ప్రకటనను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని ప్రభుత్వం కోరింది.

ఇదీ చదవండి : నేడు ఏపీ - అమూల్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.