ETV Bharat / city

మూడు రాజధానులకు.. ఈ నెల 16న శంకుస్థాపన..?

author img

By

Published : Aug 9, 2020, 3:12 AM IST

Updated : Aug 9, 2020, 3:54 AM IST

మూడు రాజధానుల శంకుస్థాపన దిశగా రాష్ట్ర ప్రభుత్వం.. వడివడిగా అడుగులేస్తోంది. ఈ నెల 16న ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం.

మూడు రాజధానులకు.. ఈ నెల 16న శంకుస్థాపన..?
మూడు రాజధానులకు.. ఈ నెల 16న శంకుస్థాపన..?
మూడు రాజధానులకు ఈనెల 16న శంకుస్థాపన..?

పాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో తదుపరి కార్యచరణపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచుతోంది. మూడు రాజధానుల శంకుస్థాపనకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 16న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయన అపాయింట్‌మెంట్‌ కోరారు. మూడు రాజధానుల శంకుస్థాపనతో పాటు..పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొనాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించాలని భావిస్తున్నారు.

ఈ విషయమై ప్రధాని కార్యాలయ సంయుక్త అధికారి వి.శేషాద్రికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఆ లేఖ ప్రతిని ప్రధాని కార్యాలయ ఓఎస్డీ సంజయ్‌కు కూడా పంపారు.

ముహూర్తాలు లేనందునే..!

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృతాభివృద్ధి చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉంటాయి. ఈ మూడు రాజధానుల శంకుస్థాపన చేసేందుకు ఈనెల 16వ తేదీని ముహూర్తంగా నిర్ణయించామని ప్రధాని కార్యాలయ సంయుక్త అధికారి రాసిన లేఖలో ప్రవీణ్‌ ప్రకాష్‌ వెల్లడించారు. ఈ తేదీ తర్వాత మళ్లీ 2 నెలల పాటు ముహూర్తాలు లేవని..అందువల్ల వీలైనంత త్వరగా ప్రధాని నరేంద్రమోదీతో అపాయింట్‌మెంట్ ఖరారు చేస్తే ముఖ్యమంత్రి జగన్‌ ఆయనను స్వయంగా కలిసి 2 ప్రాజెక్టుల గురించి వివరించి ఆహ్వానిస్తారని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి..

రాష్ట్రంపై కరోనా పడగ... మళ్లీ పది వేలకు పైగా కేసులు

మూడు రాజధానులకు ఈనెల 16న శంకుస్థాపన..?

పాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో తదుపరి కార్యచరణపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచుతోంది. మూడు రాజధానుల శంకుస్థాపనకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 16న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయన అపాయింట్‌మెంట్‌ కోరారు. మూడు రాజధానుల శంకుస్థాపనతో పాటు..పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొనాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించాలని భావిస్తున్నారు.

ఈ విషయమై ప్రధాని కార్యాలయ సంయుక్త అధికారి వి.శేషాద్రికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఆ లేఖ ప్రతిని ప్రధాని కార్యాలయ ఓఎస్డీ సంజయ్‌కు కూడా పంపారు.

ముహూర్తాలు లేనందునే..!

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృతాభివృద్ధి చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉంటాయి. ఈ మూడు రాజధానుల శంకుస్థాపన చేసేందుకు ఈనెల 16వ తేదీని ముహూర్తంగా నిర్ణయించామని ప్రధాని కార్యాలయ సంయుక్త అధికారి రాసిన లేఖలో ప్రవీణ్‌ ప్రకాష్‌ వెల్లడించారు. ఈ తేదీ తర్వాత మళ్లీ 2 నెలల పాటు ముహూర్తాలు లేవని..అందువల్ల వీలైనంత త్వరగా ప్రధాని నరేంద్రమోదీతో అపాయింట్‌మెంట్ ఖరారు చేస్తే ముఖ్యమంత్రి జగన్‌ ఆయనను స్వయంగా కలిసి 2 ప్రాజెక్టుల గురించి వివరించి ఆహ్వానిస్తారని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి..

రాష్ట్రంపై కరోనా పడగ... మళ్లీ పది వేలకు పైగా కేసులు

Last Updated : Aug 9, 2020, 3:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.