జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లోని వివిధ అంశాల అమలులో రాష్ట్రం ఉత్తమ పని తీరు కనబరిచినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శి రోహిత్ కుమార్ అభినందించారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నరేగా పనితీరుపై వివిధ రాష్ట్రాల గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులతో సంయుక్త కమిషనర్ దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో సమావేశంలో పలు అంశాల్లో రాష్ట్రం పనితీరుపట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వేధిస్తున్న పవర్ కట్.. విద్యుత్ ఉత్పత్తి లేకపోవడమే కారణం