రాజధాని అమరావతి ఉద్యమంలో బుధవారం ఒకరోజే ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. వెలగపూడికి చెందిన రైతు ఆంజనేయులు, మందడానికి చెందిన మాదాల రామారావు (80) గుండెపోటుతో మృతి చెందారు. అమరావతి ఉద్యమంలో ఇద్దరు రైతులు చురుగ్గా పాల్గొన్నారు.
అమరావతిలో ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి
రాజధాని అమరావతి ప్రాంతంలో మరో ఇద్దరు రైతులు గుండెపోటుతో మరణించారు. మందడానికి చెందిన మాదాల రామారావు, వెలగపూడికి చెందిన రైతు ఆంజనేయులు రాజధాని నిర్మాణానికి తమ భూములు ఇచ్చారు.
![అమరావతిలో ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి అమరావతిలో మరో ఇద్దరు రైతులు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10054017-1090-10054017-1609336912940.jpg?imwidth=3840)
అమరావతి నిర్మాణానికి రామారావు 20ఎకరాలు ఇచ్చారు. రాజధాని తరలిపోతోందని గత కొంతకాలంగా బాధ పడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అమరావతి నిర్మాణానికి ఆంజనేయులు(62) ఏడు ఎకరాలు ఇచ్చారు. అమరావతి ఉద్యమంలో కుటుంబం మొత్తం పాల్గొంటున్నారు. మంగళవారం సాయంత్రం సైతం ఆంజనేయులు ఉద్యమంలో పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో విజయవాడకు తరలించారు. చికిత్స పొందుతూ అంజనేయులు ప్రాణాలు వదిలారు.
ఇదీ చదవండి: 378వ రోజూ కొనసాగిన రాజధాని గ్రామాల్లో నిరసనలు
రాజధాని అమరావతి ఉద్యమంలో బుధవారం ఒకరోజే ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. వెలగపూడికి చెందిన రైతు ఆంజనేయులు, మందడానికి చెందిన మాదాల రామారావు (80) గుండెపోటుతో మృతి చెందారు. అమరావతి ఉద్యమంలో ఇద్దరు రైతులు చురుగ్గా పాల్గొన్నారు.
అమరావతి నిర్మాణానికి రామారావు 20ఎకరాలు ఇచ్చారు. రాజధాని తరలిపోతోందని గత కొంతకాలంగా బాధ పడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అమరావతి నిర్మాణానికి ఆంజనేయులు(62) ఏడు ఎకరాలు ఇచ్చారు. అమరావతి ఉద్యమంలో కుటుంబం మొత్తం పాల్గొంటున్నారు. మంగళవారం సాయంత్రం సైతం ఆంజనేయులు ఉద్యమంలో పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో విజయవాడకు తరలించారు. చికిత్స పొందుతూ అంజనేయులు ప్రాణాలు వదిలారు.
ఇదీ చదవండి: 378వ రోజూ కొనసాగిన రాజధాని గ్రామాల్లో నిరసనలు