ETV Bharat / city

AP High Court: ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారికి వారం జైలుశిక్ష

author img

By

Published : Jun 22, 2021, 4:03 PM IST

Updated : Jun 23, 2021, 3:00 AM IST

Andhra Pradesh high court sends two IAS officers to jail
Andhra Pradesh high court sends two IAS officers to jail

15:57 June 22

ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయలేదని..

కోర్టుధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి , ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ , అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది . వారికి తొలుత నాలుగు వారాల జైలు శిక్ష , రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది . వారిని కస్టడీలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది . కోర్టు ఉత్తర్వుల అమలుకు మరో అవకాశం ఇవ్వాలని అధికారులు , వారి తరఫు న్యాయవాదులు అభ్యర్థించడంతో జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం ఉపసంహరించుకుంది . కోర్టు ఆదేశాల అమలు కోసం రెండు వారాల సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది . హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు .

   ఉద్యానవన శాఖ విలేజ్ హార్టీకల్చర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది . ఎంపిక ప్రక్రియ మధ్యలో ఉండగా .. నిబంధనలను మార్చడంతో అనర్హతలకు గురయ్యామని 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు . విచారణ జరిపిన న్యాయస్థానం .. నోటిఫికేషన్ సవరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి , పిటిషనర్లకు పోస్టుల భర్తీలో అవకాశం కల్పించాలంది . 2020 సెప్పెంబర్ 9 న ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది . ఆ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో 36 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు . న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో తాజా విచారణకు ఇరువురు అధికారులు కోర్టుకు హాజరయ్యారు . ఉద్దేశపూర్వకంగా ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు న్యాయమూర్తి తొలత అధికారులకు జైలు శిక్ష విధించారు . మరో అవకాశం ఇవ్వాలని అధికారులు అభ్యర్థించడంతో జైలు శిక్ష విధింపు ఉత్తర్వులను ఉపసంహరించారు . రెండు వారాల సమయం ఇచ్చారు .

ఇదీ చదవండి

MLC THOTA: పోలీసులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అసహనం..

15:57 June 22

ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయలేదని..

కోర్టుధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి , ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ , అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది . వారికి తొలుత నాలుగు వారాల జైలు శిక్ష , రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది . వారిని కస్టడీలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది . కోర్టు ఉత్తర్వుల అమలుకు మరో అవకాశం ఇవ్వాలని అధికారులు , వారి తరఫు న్యాయవాదులు అభ్యర్థించడంతో జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం ఉపసంహరించుకుంది . కోర్టు ఆదేశాల అమలు కోసం రెండు వారాల సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది . హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు .

   ఉద్యానవన శాఖ విలేజ్ హార్టీకల్చర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది . ఎంపిక ప్రక్రియ మధ్యలో ఉండగా .. నిబంధనలను మార్చడంతో అనర్హతలకు గురయ్యామని 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు . విచారణ జరిపిన న్యాయస్థానం .. నోటిఫికేషన్ సవరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి , పిటిషనర్లకు పోస్టుల భర్తీలో అవకాశం కల్పించాలంది . 2020 సెప్పెంబర్ 9 న ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది . ఆ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో 36 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు . న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో తాజా విచారణకు ఇరువురు అధికారులు కోర్టుకు హాజరయ్యారు . ఉద్దేశపూర్వకంగా ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు న్యాయమూర్తి తొలత అధికారులకు జైలు శిక్ష విధించారు . మరో అవకాశం ఇవ్వాలని అధికారులు అభ్యర్థించడంతో జైలు శిక్ష విధింపు ఉత్తర్వులను ఉపసంహరించారు . రెండు వారాల సమయం ఇచ్చారు .

ఇదీ చదవండి

MLC THOTA: పోలీసులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అసహనం..

Last Updated : Jun 23, 2021, 3:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.