ETV Bharat / city

డీజీపీ ఆదేశాలను కిందిస్థాయి పోలీసులు పాటించకపోతే ఎలా : హైకోర్టు

DGP attended in High Court: రేషన్‌ బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే వారితో పోలీసులు కుమ్మక్కు అవుతున్నట్లు ఉందని.. హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. నిర్దేశిత విధానానికి భిన్నంగా తనిఖీలు, జప్తులు, పంచనామాలు నిర్వహిస్తే.. ఆ కేసులు న్యాయస్థానం ముందు ఎలా నిలబడతాయని.. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రశ్నించింది.

author img

By

Published : Oct 1, 2022, 10:15 AM IST

Updated : Oct 1, 2022, 2:13 PM IST

DGP
డీజీపీ

DGP Attended In AP High Court: రేషన్‌ బియ్యం తరలిస్తున్నాననే నెపంతో.. నంద్యాల జిల్లా పాములుపాడు పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్సై సీజ్‌ చేసిన తన లారీని విడిచిపెట్టేలా ఆదేశాలివ్వాలంటూ.. రఫీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నిత్యావసర సరుకుల చట్టం నిబంధల ప్రకారం వాహనాల తనిఖీ, సరుకు సీజ్‌ చేసే అధికారం ఏఎస్​ఐకి లేదని.. ఇదే అంశంపై కోర్టుకు వెళ్లిన మరో పిటిషనర్‌ తెలిపారు. దిగువ స్థాయి పోలీసులు వాహనాలు సీజ్‌ చేసి నెలల తరబడి ఠాణాల్లో ఉంచుతున్నారని, ఎస్​ఐ హోదాకు తగ్గని వ్యక్తి తనిఖీలు చేయడానికి వీల్లేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. డీజీపీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.

కోర్టు ఉత్తర్వులు పాటించాలని డీజీపీ సర్క్యులర్‌ ఇచ్చారని, కొందరు కిందిస్థాయి సిబ్బంది దాన్ని పట్టించుకోకపోవడం వాస్తవమేనని ఏజీ అంగీకరించారు. సర్క్యులర్‌ ఇచ్చి వదిలేస్తే ఎలాగన్న న్యాయమూర్తి.. ఇప్పటికీ ఈ తరహా కేసులు దాఖలు అవుతున్నాయని గుర్తుచేశారు. ఈనేపథ్యంలో డీజీపీని పిలిపించామని, దీన్ని పనిష్‌మెంట్‌గా భావించొద్దని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అధికారం లేని పోలీసు అధికారి కేసు నమోదు చేస్తే న్యాయసమీక్షకు నిలుస్తుందా? అనినేరుగా డీజీపీనే ప్రశ్నించారు. నిలువదని బదులిచ్చిన డీజీపీ రేషన్‌ బియ్యం అక్రమ రవాణా తనిఖీల విషయంలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన పోలీసుల్ని డిస్‌మిస్‌ చేస్తామన్నారు.

అధికారం లేని పోలీసు అధికారులు బియ్యం అక్రమ రవాణాను తనిఖీలు చేయడం, వాహనాలను సీజ్‌ చేయడం, కేసులు నమోదు చేయడం, పంచనామా సమయంలో స్వతంత్ర సాక్షులు లేకుండా.. కేవలం వీఆర్‌వోలు, మహిళ పోలీసుల సమక్షంలోనే నిర్వహించడం చూస్తుంటే, రేషన్‌ బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే వారితో కుమ్మక్కు అవుతున్నట్లు పోలీసుల తీరు ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీస్‌ బాస్‌గా డీజీపీ ఇచ్చిన ఆదేశాలనే కిందిస్థాయి పోలీసులు పట్టించుకోలేదంటే ఏవిధంగా అర్థం చేసుకోవాలని డీజీపీని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.

రాష్ట్రం నుంచి పెద్దమొత్తంలో బియ్యం తరలిపోతోందని తెలిపింది. పోలీసు బాస్‌గా ఏ పోర్టు నుంచి రవాణా చేస్తున్నారో మీకు తెలిసే ఉంటుందని వ్యాఖ్యానించారు. పోలీసులు నమోదు చేసిన 90శాతం కేసుల్లో 50శాతం కేసులు అధికారం లేని పోలీసులు నమోదు చేసినవేనని, మరో 40శాతం పంచనామా సమయంలో ప్రభుత్వ అధికారులు, వీఆర్‌వోలు మధ్యవర్తులుగా ఉన్నవేనన్నారు. ఈ కేసులన్నీ కోర్టు ముందు వీగిపోవడానికి వీలున్నవేనన్నారు. కోర్టుఉత్తర్వులకు సంబంధించి జారీచేసిన సర్క్యులర్‌పై అసలు అవగాహన ఉందా? లేదంటే సాధారణ ఫైలు మాదిరిగా సంతకం చేశారా అని డీజీపీని కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుత కేసు విషయంలో ఎస్సై ఏఎస్సైని సస్పెండ్‌ చేశామని రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పగా.. మిగిలిన కేసుల్లో పరిస్థితి ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. వాటినీ సమీక్షిస్తాననని, జిల్లా ఎస్పీలనే.. అక్రమ రవాణా కేసుల్ని నేరుగా పర్యవేక్షించాలని ఆదేశాలిస్తామని డీజీపీ వివరణ ఇచ్చారు.

హైకోర్టులో స్వయంగా హాజరైన డీజీపీ

ఇవీ చదవండి:

DGP Attended In AP High Court: రేషన్‌ బియ్యం తరలిస్తున్నాననే నెపంతో.. నంద్యాల జిల్లా పాములుపాడు పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్సై సీజ్‌ చేసిన తన లారీని విడిచిపెట్టేలా ఆదేశాలివ్వాలంటూ.. రఫీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నిత్యావసర సరుకుల చట్టం నిబంధల ప్రకారం వాహనాల తనిఖీ, సరుకు సీజ్‌ చేసే అధికారం ఏఎస్​ఐకి లేదని.. ఇదే అంశంపై కోర్టుకు వెళ్లిన మరో పిటిషనర్‌ తెలిపారు. దిగువ స్థాయి పోలీసులు వాహనాలు సీజ్‌ చేసి నెలల తరబడి ఠాణాల్లో ఉంచుతున్నారని, ఎస్​ఐ హోదాకు తగ్గని వ్యక్తి తనిఖీలు చేయడానికి వీల్లేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. డీజీపీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.

కోర్టు ఉత్తర్వులు పాటించాలని డీజీపీ సర్క్యులర్‌ ఇచ్చారని, కొందరు కిందిస్థాయి సిబ్బంది దాన్ని పట్టించుకోకపోవడం వాస్తవమేనని ఏజీ అంగీకరించారు. సర్క్యులర్‌ ఇచ్చి వదిలేస్తే ఎలాగన్న న్యాయమూర్తి.. ఇప్పటికీ ఈ తరహా కేసులు దాఖలు అవుతున్నాయని గుర్తుచేశారు. ఈనేపథ్యంలో డీజీపీని పిలిపించామని, దీన్ని పనిష్‌మెంట్‌గా భావించొద్దని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అధికారం లేని పోలీసు అధికారి కేసు నమోదు చేస్తే న్యాయసమీక్షకు నిలుస్తుందా? అనినేరుగా డీజీపీనే ప్రశ్నించారు. నిలువదని బదులిచ్చిన డీజీపీ రేషన్‌ బియ్యం అక్రమ రవాణా తనిఖీల విషయంలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన పోలీసుల్ని డిస్‌మిస్‌ చేస్తామన్నారు.

అధికారం లేని పోలీసు అధికారులు బియ్యం అక్రమ రవాణాను తనిఖీలు చేయడం, వాహనాలను సీజ్‌ చేయడం, కేసులు నమోదు చేయడం, పంచనామా సమయంలో స్వతంత్ర సాక్షులు లేకుండా.. కేవలం వీఆర్‌వోలు, మహిళ పోలీసుల సమక్షంలోనే నిర్వహించడం చూస్తుంటే, రేషన్‌ బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే వారితో కుమ్మక్కు అవుతున్నట్లు పోలీసుల తీరు ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీస్‌ బాస్‌గా డీజీపీ ఇచ్చిన ఆదేశాలనే కిందిస్థాయి పోలీసులు పట్టించుకోలేదంటే ఏవిధంగా అర్థం చేసుకోవాలని డీజీపీని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.

రాష్ట్రం నుంచి పెద్దమొత్తంలో బియ్యం తరలిపోతోందని తెలిపింది. పోలీసు బాస్‌గా ఏ పోర్టు నుంచి రవాణా చేస్తున్నారో మీకు తెలిసే ఉంటుందని వ్యాఖ్యానించారు. పోలీసులు నమోదు చేసిన 90శాతం కేసుల్లో 50శాతం కేసులు అధికారం లేని పోలీసులు నమోదు చేసినవేనని, మరో 40శాతం పంచనామా సమయంలో ప్రభుత్వ అధికారులు, వీఆర్‌వోలు మధ్యవర్తులుగా ఉన్నవేనన్నారు. ఈ కేసులన్నీ కోర్టు ముందు వీగిపోవడానికి వీలున్నవేనన్నారు. కోర్టుఉత్తర్వులకు సంబంధించి జారీచేసిన సర్క్యులర్‌పై అసలు అవగాహన ఉందా? లేదంటే సాధారణ ఫైలు మాదిరిగా సంతకం చేశారా అని డీజీపీని కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుత కేసు విషయంలో ఎస్సై ఏఎస్సైని సస్పెండ్‌ చేశామని రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పగా.. మిగిలిన కేసుల్లో పరిస్థితి ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. వాటినీ సమీక్షిస్తాననని, జిల్లా ఎస్పీలనే.. అక్రమ రవాణా కేసుల్ని నేరుగా పర్యవేక్షించాలని ఆదేశాలిస్తామని డీజీపీ వివరణ ఇచ్చారు.

హైకోర్టులో స్వయంగా హాజరైన డీజీపీ

ఇవీ చదవండి:

Last Updated : Oct 1, 2022, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.