ETV Bharat / city

AGRI GOLD: హామీలు నెరవేర్చేదెన్నడు... అగ్రిగోల్డ్ బాధితుల వేదన తీరేదెన్నడు?

author img

By

Published : Jul 21, 2021, 6:48 AM IST

లక్షల మంది చిరు వ్యాపారులు, బడుగు జీవులు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలనుకున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు తదితర భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్‌లో ఆ సొమ్ములు డిపాజిట్‌ చేశారు. రోజూ చిన్నమొత్తాల్లో కట్టినవారు కొందరైతే, ఒకేసారి డిపాజిట్‌ చేసినవారు ఇంకొందరు. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి.

అగ్రిగోల్డ్ బాధితులకు తీరని వేదన
అగ్రిగోల్డ్ బాధితులకు తీరని వేదన

లక్షల మంది చిరువ్యాపారులు, బడుగు జీవులు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలనుకున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు తదితర భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్‌లో ఆ సొమ్ములు డిపాజిట్‌ చేశారు. రోజూ చిన్నమొత్తాల్లో కట్టినవారు కొందరైతే, ఒకేసారి డిపాజిట్‌ చేసినవారు ఇంకొందరు. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి.

తమ డబ్బుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న వీరికి చివరికి నిరాశే మిగిలింది. బాధితుల సొమ్ము తామే చెల్లిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌ ప్రకటించటంతో పాటు అధికారంలోకి వచ్చాక రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసినవారిలో అధికశాతం మందికి డబ్బులివ్వడంతో బాధితుల్లో ఆశలు చిగురించాయి. రెండేళ్లు గడుస్తున్నా రూ.10 వేల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేసినవారికి చెల్లింపులు చేయకపోవటంతో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వారంతా ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు.

* రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన ఖాతాదారులు 13 లక్షలు. వీరికి చెల్లించేందుకు రూ.1,150 కోట్లు అవుతుందని అంచనా.

* వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ 3.36 లక్షల మందికి రూ.234 కోట్లు చెల్లించారు.

* 20వేల లోపు కట్టిన బాధితుల్లో సాయం పొందాల్సినవారు 9.64 లక్షల మంది. వీరికి రూ.916 కోట్ల వరకూ ఇవ్వాలి.

* రూ.20 వేల కంటే ఎక్కువ కట్టిన వారినీ పరిగణనలోకి తీసుకుంటే మరో 6 లక్షల క్లెయిములు ఉన్నాయి. వాటికీ చెల్లించాలంటే మరో రూ.3,710 కోట్లు అవసరం.

కేటాయింపులు ఘనం.. ఇచ్చింది స్వల్పమే

* రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులకు చెల్లింపుల కోసం తొలి బడ్జెట్‌లో (2019-20) వైకాపా ప్రభుత్వం రూ.1,150 కోట్లు కేటాయించింది. ఆ మొత్తం నుంచి రూ.10 వేల లోపు కట్టిన వారికి చెల్లించేందుకు మొదటిదశలో రూ.263.99 కోట్లు విడుదల చేసింది. 2019 నవంబరు 7న గుంటూరులో జరిగిన సభలో 3,69,655 మందికి ఆన్‌లైన్‌ చెల్లింపును ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.

* అందులో 3.36 లక్షల మందికి రూ.234 కోట్లు అందాయని, మిగతా బాధితులకు సొమ్ములు పడలేదని, అగ్రిగోల్డ్‌ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం చెబుతోంది. ఆ లెక్కన రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసుకున్న వారిలోనే మరో 33 వేల మందికి రూ.30 కోట్ల వరకూ అందాలి.

* 2020-21 బడ్జెట్‌లో అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.200 కోట్లు కేటాయించారు. డిసెంబరులో చెల్లిస్తామని ఆ ఏడాది మేలో విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్‌లో తెలిపారు. అయినా చెల్లించలేదు.

* 2021-22 బడ్జెట్‌లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. ఫిబ్రవరిలో విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం ఆగస్టులో చెల్లించాలి.

జగన్‌ హామీలు అప్పుడు.. ఇప్పుడు..

* బడ్జెట్‌లో రూ.1,110 కోట్లు కేటాయించి అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని అసెంబ్లీలో చాలాసార్లు కోరాను. ఇలా చేస్తే 80% బాధితులకు మేలు జరుగుతుందని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1,100 కోట్లు కేటాయించి బాధితులకు న్యాయం చేస్తాం. 19 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితుల ఘోష చంద్రబాబుకు పట్టదా? - 2018 జూన్‌ 5న ప్రజాసంకల్ప యాత్రలో పశ్చిమగోదావరి జిల్లా తణుకు బహిరంగ సభలో..

* అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1,150 కోట్లు కేటాయించి, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 13 లక్షల మంది బాధితులకు వెంటనే మేలు చేస్తాం. మిగతా వారికి త్వరితగతిన పరిష్కారం చూపిస్తాం. - వైకాపా ఎన్నికల ప్రణాళికలో హామీ

* రాష్ట్రానికి చెందిన ప్రతి అగ్రిగోల్డ్‌ బాధితుడికీ చెల్లిస్తాం. ఖాతాదారులు ఆందోళన చెందక్కర్లేదు. త్వరలోనే రూ.10-20 వేల మధ్య డిపాజిట్‌ చేసిన బాధితులకు చెల్లిస్తాం. న్యాయస్థానం అనుమతించిన జాబితాలోని అందరికీ డబ్బులిస్తాం. - 2019 నవంబరు 7న చెక్కుల పంపిణీ సందర్భంగా గుంటూరులో ముఖ్యమంత్రి హోదాలో...

ట్రీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే పాత్రుని రాముది శ్రీకాకుళం జిల్లా సోంపేట. భవిష్యత్తు అవసరాల కోసం అగ్రిగోల్డ్‌లో రోజుకు రూ.30 చొప్పున రూ.12,000 కట్టారు. ఒప్పందం ప్రకారం కొన్ని రోజుల తర్వాత ఆ సంస్థ అతనికి రూ.13,500 తిరిగి చెల్లించాలి. వారు బోర్డు తిప్పేయటంతో కష్టార్జితమంతా పోయింది. ‘రోజంతా కష్టపడితే వచ్చిన దాంట్లో దాచుకున్న సొమ్ము అది. ఆరేళ్లుగా నా సొమ్ము కోసం కాళ్లరిగేలా తిరిగాను. ఒక్క రూపాయైనా చేతికందలేదు’ అని రాము ఆవేదన వ్యక్తం చేశారు.

కుమార్తె పెళ్లి చేయలేక ఇబ్బంది పడుతున్నా

లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. అగ్రిగోల్డ్‌లో రూ.2.50 లక్షలు డిపాజిట్‌ చేశాను. ఆరేళ్ల తర్వాత రూ.6 లక్షలు ఇవ్వాలి. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్ల పెళ్లి కోసం దాచి, మొత్తానికే మోసపోయాను. ఎలాగో పెద్దమ్మాయి పెళ్లి చేశాను. రెండో అమ్మాయికి చేయటానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. నేను దాచుకున్న సొమ్ము చేతిలో ఉంటే ఇప్పుడిన్ని సమస్యలు ఉండేవి కాదు. ఇప్పటివరకూ ఒక్క రూపాయి అందలేదు. కొవిడ్‌ ప్రభావంతో లారీ పరిశ్రమ బాగా దెబ్బతింది. అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకురావాల్సి వస్తోంది.

- వెంకటస్వామి, ఆత్మకూరు, కర్నూలు జిల్లా

చిన్న గదిలో అల్పాహారశాలతో జీవనం కొనసాగించే పరమేశ్వరప్పది కర్నూలు జిల్లా ఆత్మకూరు. విడతల వారీగా అగ్రిగోల్డ్‌లో రూ.2.20 లక్షలు డిపాజిట్‌ చేశారు. ఆ సంస్థ మోసగించటంతో అతని పరిస్థితి తలకిందులైంది. 2019 నవంబరులో ఒక బాండుపై ప్రభుత్వం రూ.10 వేలు చెల్లించింది. ఇంకా రూ.2.10 లక్షలు రావాలి. ‘నా భార్య మందులు, ఇతర వైద్యఖర్చులకే నెలకు రూ.3 వేలు ఖర్చవుతోంది. అక్కడ వేసిన డబ్బులు ఇప్పుడు ఉంటే ఎంతో ఆసరాగా ఉండేది’ అని పరమేశ్వరప్ప వాపోయారు.

వారంలో ఇస్తామన్నారు.. 100 వారాలు గడిచిపోయాయి

ధికారం చేపట్టిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్‌ బాధితుల్లోని 13 లక్షల మందికి డబ్బులు చెల్లిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి బాధితులతో 2017 మార్చి 23న దీక్ష విరమింపజేశారు. వంద వారాలు దాటుతున్నా.. ఇప్పటికీ చెల్లించలేదు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 22 నుంచి 28 వరకూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, విజయవాడలో బాధితులతో రిలే దీక్షలు చేపడతాం. 31న ముఖ్యమంత్రి నివాసానికి విజ్ఞాపన యాత్ర చేపడతాం. ఇచ్చిన హామీని నెరవేర్చాలనే మేము కోరుతున్నాం. కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు. - ముప్పాళ్ల నాగేశ్వరరావు, అగ్రిగోల్డ్‌ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు

అమ్మాయి పెళ్లికి అప్పు చేయాల్సి వచ్చింది

నా భర్త చనిపోయారు. వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అమ్మాయి పెళ్లికి ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్‌లో రూ.25 వేలు డిపాజిట్‌ చేశాను. ఆ సంస్థ మోసగించటంతో నా సొమ్మంతా పోయింది. రూ.8 వేల డిపాజిట్‌ డబ్బుల్ని ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం చెల్లించింది. మరో రూ.17 వేల బాండుకు ఇప్పటివరకూ ఏమీ ఇవ్వలేదు. అప్పు చేసి గతేడాది నా కుమార్తె పెళ్లి చేశాను. అప్పట్లో దాచుకున్న డబ్బులు ఉంటే అప్పు చేయాల్సిన అవసరం ఏర్పడేది కాదు. - సుంకరి కన్నమ్మ, బుడ్డిపేట, సీతానగరం మండలం, విజయనగరం

కష్టార్జితం ఇప్పించాలని ప్రతి ఒక్కరినీ అడిగా

వీధి వీధి తిరిగి చేపలు అమ్ముతూ, కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అప్పుడప్పుడు పొదుపు చేసుకున్న సొమ్ము రూ.20 వేలను రెండు విడతలుగా అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేశా. ఆరేళ్ల తర్వాత రెట్టింపు సొమ్ము వస్తుందంటే ఆశ పడ్డాను. నా కుమార్తెల పెళ్లికి ఉపయోగించొచ్చని అనుకున్నా. కానీ ఆ సొమ్మంతా పోయింది. నా కష్టార్జితాన్ని తిరిగి ఇప్పించాలని ప్రతి ఒక్కరినీ అడిగాను. అయినా ఫలితం లేదు. ఆ డబ్బుల కోసం నేను ఏడవని రోజు లేదు. - గవల ద్రౌపది, కవిటి, శ్రీకాకుళం జిల్లా

రూ.2.30 లక్షలు డిపాజిట్‌ చేస్తే రూ.10 వేలే వచ్చింది

గ్రిగోల్డ్‌లో విడతల వారీగా రూ.2.30 లక్షలు డిపాజిట్‌ చేశాను. అందులో రూ.10 వేలు మాత్రమే ఏడాదిన్నర కిందట తిరిగి చెల్లించారు. మిగతా డబ్బుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారో తెలియదు. హోటళ్లలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే నేను.. ఎన్నో ఏళ్ల కష్టార్జితాన్ని అందులో డిపాజిట్‌ చేశాను. నా కుమార్తెల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందనుకున్నా కానీ మొత్తం పోయింది. కరోనా ప్రభావంతో ఇప్పుడు హోటళ్లు కూడా సరిగ్గా నడవట్లేదు. ఉపాధి దొరకట్లేదు. ఇబ్బందులు పడుతున్నా. - ఎచ్చెర్ల ఆదిబాబు, శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ఇదీ చదవండి:

Night curfew in ap: మరో వారం.. రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు

లక్షల మంది చిరువ్యాపారులు, బడుగు జీవులు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలనుకున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు తదితర భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్‌లో ఆ సొమ్ములు డిపాజిట్‌ చేశారు. రోజూ చిన్నమొత్తాల్లో కట్టినవారు కొందరైతే, ఒకేసారి డిపాజిట్‌ చేసినవారు ఇంకొందరు. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి.

తమ డబ్బుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న వీరికి చివరికి నిరాశే మిగిలింది. బాధితుల సొమ్ము తామే చెల్లిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌ ప్రకటించటంతో పాటు అధికారంలోకి వచ్చాక రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసినవారిలో అధికశాతం మందికి డబ్బులివ్వడంతో బాధితుల్లో ఆశలు చిగురించాయి. రెండేళ్లు గడుస్తున్నా రూ.10 వేల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేసినవారికి చెల్లింపులు చేయకపోవటంతో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వారంతా ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు.

* రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన ఖాతాదారులు 13 లక్షలు. వీరికి చెల్లించేందుకు రూ.1,150 కోట్లు అవుతుందని అంచనా.

* వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ 3.36 లక్షల మందికి రూ.234 కోట్లు చెల్లించారు.

* 20వేల లోపు కట్టిన బాధితుల్లో సాయం పొందాల్సినవారు 9.64 లక్షల మంది. వీరికి రూ.916 కోట్ల వరకూ ఇవ్వాలి.

* రూ.20 వేల కంటే ఎక్కువ కట్టిన వారినీ పరిగణనలోకి తీసుకుంటే మరో 6 లక్షల క్లెయిములు ఉన్నాయి. వాటికీ చెల్లించాలంటే మరో రూ.3,710 కోట్లు అవసరం.

కేటాయింపులు ఘనం.. ఇచ్చింది స్వల్పమే

* రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులకు చెల్లింపుల కోసం తొలి బడ్జెట్‌లో (2019-20) వైకాపా ప్రభుత్వం రూ.1,150 కోట్లు కేటాయించింది. ఆ మొత్తం నుంచి రూ.10 వేల లోపు కట్టిన వారికి చెల్లించేందుకు మొదటిదశలో రూ.263.99 కోట్లు విడుదల చేసింది. 2019 నవంబరు 7న గుంటూరులో జరిగిన సభలో 3,69,655 మందికి ఆన్‌లైన్‌ చెల్లింపును ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.

* అందులో 3.36 లక్షల మందికి రూ.234 కోట్లు అందాయని, మిగతా బాధితులకు సొమ్ములు పడలేదని, అగ్రిగోల్డ్‌ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం చెబుతోంది. ఆ లెక్కన రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసుకున్న వారిలోనే మరో 33 వేల మందికి రూ.30 కోట్ల వరకూ అందాలి.

* 2020-21 బడ్జెట్‌లో అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.200 కోట్లు కేటాయించారు. డిసెంబరులో చెల్లిస్తామని ఆ ఏడాది మేలో విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్‌లో తెలిపారు. అయినా చెల్లించలేదు.

* 2021-22 బడ్జెట్‌లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. ఫిబ్రవరిలో విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం ఆగస్టులో చెల్లించాలి.

జగన్‌ హామీలు అప్పుడు.. ఇప్పుడు..

* బడ్జెట్‌లో రూ.1,110 కోట్లు కేటాయించి అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని అసెంబ్లీలో చాలాసార్లు కోరాను. ఇలా చేస్తే 80% బాధితులకు మేలు జరుగుతుందని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1,100 కోట్లు కేటాయించి బాధితులకు న్యాయం చేస్తాం. 19 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితుల ఘోష చంద్రబాబుకు పట్టదా? - 2018 జూన్‌ 5న ప్రజాసంకల్ప యాత్రలో పశ్చిమగోదావరి జిల్లా తణుకు బహిరంగ సభలో..

* అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1,150 కోట్లు కేటాయించి, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 13 లక్షల మంది బాధితులకు వెంటనే మేలు చేస్తాం. మిగతా వారికి త్వరితగతిన పరిష్కారం చూపిస్తాం. - వైకాపా ఎన్నికల ప్రణాళికలో హామీ

* రాష్ట్రానికి చెందిన ప్రతి అగ్రిగోల్డ్‌ బాధితుడికీ చెల్లిస్తాం. ఖాతాదారులు ఆందోళన చెందక్కర్లేదు. త్వరలోనే రూ.10-20 వేల మధ్య డిపాజిట్‌ చేసిన బాధితులకు చెల్లిస్తాం. న్యాయస్థానం అనుమతించిన జాబితాలోని అందరికీ డబ్బులిస్తాం. - 2019 నవంబరు 7న చెక్కుల పంపిణీ సందర్భంగా గుంటూరులో ముఖ్యమంత్రి హోదాలో...

ట్రీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే పాత్రుని రాముది శ్రీకాకుళం జిల్లా సోంపేట. భవిష్యత్తు అవసరాల కోసం అగ్రిగోల్డ్‌లో రోజుకు రూ.30 చొప్పున రూ.12,000 కట్టారు. ఒప్పందం ప్రకారం కొన్ని రోజుల తర్వాత ఆ సంస్థ అతనికి రూ.13,500 తిరిగి చెల్లించాలి. వారు బోర్డు తిప్పేయటంతో కష్టార్జితమంతా పోయింది. ‘రోజంతా కష్టపడితే వచ్చిన దాంట్లో దాచుకున్న సొమ్ము అది. ఆరేళ్లుగా నా సొమ్ము కోసం కాళ్లరిగేలా తిరిగాను. ఒక్క రూపాయైనా చేతికందలేదు’ అని రాము ఆవేదన వ్యక్తం చేశారు.

కుమార్తె పెళ్లి చేయలేక ఇబ్బంది పడుతున్నా

లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. అగ్రిగోల్డ్‌లో రూ.2.50 లక్షలు డిపాజిట్‌ చేశాను. ఆరేళ్ల తర్వాత రూ.6 లక్షలు ఇవ్వాలి. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్ల పెళ్లి కోసం దాచి, మొత్తానికే మోసపోయాను. ఎలాగో పెద్దమ్మాయి పెళ్లి చేశాను. రెండో అమ్మాయికి చేయటానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. నేను దాచుకున్న సొమ్ము చేతిలో ఉంటే ఇప్పుడిన్ని సమస్యలు ఉండేవి కాదు. ఇప్పటివరకూ ఒక్క రూపాయి అందలేదు. కొవిడ్‌ ప్రభావంతో లారీ పరిశ్రమ బాగా దెబ్బతింది. అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకురావాల్సి వస్తోంది.

- వెంకటస్వామి, ఆత్మకూరు, కర్నూలు జిల్లా

చిన్న గదిలో అల్పాహారశాలతో జీవనం కొనసాగించే పరమేశ్వరప్పది కర్నూలు జిల్లా ఆత్మకూరు. విడతల వారీగా అగ్రిగోల్డ్‌లో రూ.2.20 లక్షలు డిపాజిట్‌ చేశారు. ఆ సంస్థ మోసగించటంతో అతని పరిస్థితి తలకిందులైంది. 2019 నవంబరులో ఒక బాండుపై ప్రభుత్వం రూ.10 వేలు చెల్లించింది. ఇంకా రూ.2.10 లక్షలు రావాలి. ‘నా భార్య మందులు, ఇతర వైద్యఖర్చులకే నెలకు రూ.3 వేలు ఖర్చవుతోంది. అక్కడ వేసిన డబ్బులు ఇప్పుడు ఉంటే ఎంతో ఆసరాగా ఉండేది’ అని పరమేశ్వరప్ప వాపోయారు.

వారంలో ఇస్తామన్నారు.. 100 వారాలు గడిచిపోయాయి

ధికారం చేపట్టిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్‌ బాధితుల్లోని 13 లక్షల మందికి డబ్బులు చెల్లిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి బాధితులతో 2017 మార్చి 23న దీక్ష విరమింపజేశారు. వంద వారాలు దాటుతున్నా.. ఇప్పటికీ చెల్లించలేదు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 22 నుంచి 28 వరకూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, విజయవాడలో బాధితులతో రిలే దీక్షలు చేపడతాం. 31న ముఖ్యమంత్రి నివాసానికి విజ్ఞాపన యాత్ర చేపడతాం. ఇచ్చిన హామీని నెరవేర్చాలనే మేము కోరుతున్నాం. కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు. - ముప్పాళ్ల నాగేశ్వరరావు, అగ్రిగోల్డ్‌ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు

అమ్మాయి పెళ్లికి అప్పు చేయాల్సి వచ్చింది

నా భర్త చనిపోయారు. వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అమ్మాయి పెళ్లికి ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్‌లో రూ.25 వేలు డిపాజిట్‌ చేశాను. ఆ సంస్థ మోసగించటంతో నా సొమ్మంతా పోయింది. రూ.8 వేల డిపాజిట్‌ డబ్బుల్ని ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం చెల్లించింది. మరో రూ.17 వేల బాండుకు ఇప్పటివరకూ ఏమీ ఇవ్వలేదు. అప్పు చేసి గతేడాది నా కుమార్తె పెళ్లి చేశాను. అప్పట్లో దాచుకున్న డబ్బులు ఉంటే అప్పు చేయాల్సిన అవసరం ఏర్పడేది కాదు. - సుంకరి కన్నమ్మ, బుడ్డిపేట, సీతానగరం మండలం, విజయనగరం

కష్టార్జితం ఇప్పించాలని ప్రతి ఒక్కరినీ అడిగా

వీధి వీధి తిరిగి చేపలు అమ్ముతూ, కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అప్పుడప్పుడు పొదుపు చేసుకున్న సొమ్ము రూ.20 వేలను రెండు విడతలుగా అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేశా. ఆరేళ్ల తర్వాత రెట్టింపు సొమ్ము వస్తుందంటే ఆశ పడ్డాను. నా కుమార్తెల పెళ్లికి ఉపయోగించొచ్చని అనుకున్నా. కానీ ఆ సొమ్మంతా పోయింది. నా కష్టార్జితాన్ని తిరిగి ఇప్పించాలని ప్రతి ఒక్కరినీ అడిగాను. అయినా ఫలితం లేదు. ఆ డబ్బుల కోసం నేను ఏడవని రోజు లేదు. - గవల ద్రౌపది, కవిటి, శ్రీకాకుళం జిల్లా

రూ.2.30 లక్షలు డిపాజిట్‌ చేస్తే రూ.10 వేలే వచ్చింది

గ్రిగోల్డ్‌లో విడతల వారీగా రూ.2.30 లక్షలు డిపాజిట్‌ చేశాను. అందులో రూ.10 వేలు మాత్రమే ఏడాదిన్నర కిందట తిరిగి చెల్లించారు. మిగతా డబ్బుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారో తెలియదు. హోటళ్లలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే నేను.. ఎన్నో ఏళ్ల కష్టార్జితాన్ని అందులో డిపాజిట్‌ చేశాను. నా కుమార్తెల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందనుకున్నా కానీ మొత్తం పోయింది. కరోనా ప్రభావంతో ఇప్పుడు హోటళ్లు కూడా సరిగ్గా నడవట్లేదు. ఉపాధి దొరకట్లేదు. ఇబ్బందులు పడుతున్నా. - ఎచ్చెర్ల ఆదిబాబు, శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ఇదీ చదవండి:

Night curfew in ap: మరో వారం.. రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.