ETV Bharat / city

Green India Challenge: రామోజీ ఫిల్మ్​సిటీలో మొక్క నాటిన ఆది పినిశెట్టి

author img

By

Published : Aug 1, 2021, 8:39 PM IST

తెలంగాణలోని రామోజీ ఫిల్మ్​సిటీలో చేపట్టిన గ్రీన్​ ఇండియా కార్యక్రమానికి సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇటీవలే బాలీవుడ్​ సూపర్​స్టార్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, టాలీవుడ్​ కింగ్​ నాగార్జున మొక్కలు నాటగా.. తాజాగా ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్నాడు.

Green India Challenge
రామోజీ ఫిల్మ్​సిటీలో మొక్క నాటిన ఆది పినిశెట్టి
రామోజీ ఫిల్మ్​సిటీలో మొక్క నాటిన ఆది పినిశెట్టి

యువ కథానాయకుడు ఆది పినిశెట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్నాడు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటారు. రంగస్థలం సినిమాలో నటించిన తన సహచర నటుడు శత్రు విసిరిన సవాల్​ను ఆది స్వీకరించాడు. ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న ఆది... విరామ సమయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొని మొక్క నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను మొదలుపెట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్​కు ఆది అభినందనలు తెలిపాడు. సామాజిక మాధ్యమాల్లో రకరకాల ఛాలెంజ్​లను స్వీకరించే యువత.. బాధ్యతగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొనాలని సూచించారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఆది కోరారు. బాలీవుడ్ కథానాయకుడు మిథున్ చక్రవరి, ఆకాంక్ష సింగ్, నిక్కీ గల్రానీ, రాహుల్ రవీంద్రకు ఈ గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ను ఆది విసిరాడు.

ఇటీవలే.. గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ కార్యక్రమంలో బాలీవుడ్​ సూపర్​స్టార్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, టాలీవుడ్​ కింగ్​ నాగార్జున మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్​ కుమార్​ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఎనలేని స్పందన లభిస్తోంది.

ఇదీ చూడండి:

Green India Challenge: రామోజీ ఫిలిం సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన బిగ్​బీ

రామోజీ ఫిల్మ్​సిటీలో మొక్క నాటిన ఆది పినిశెట్టి

యువ కథానాయకుడు ఆది పినిశెట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్నాడు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటారు. రంగస్థలం సినిమాలో నటించిన తన సహచర నటుడు శత్రు విసిరిన సవాల్​ను ఆది స్వీకరించాడు. ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న ఆది... విరామ సమయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొని మొక్క నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను మొదలుపెట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్​కు ఆది అభినందనలు తెలిపాడు. సామాజిక మాధ్యమాల్లో రకరకాల ఛాలెంజ్​లను స్వీకరించే యువత.. బాధ్యతగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొనాలని సూచించారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఆది కోరారు. బాలీవుడ్ కథానాయకుడు మిథున్ చక్రవరి, ఆకాంక్ష సింగ్, నిక్కీ గల్రానీ, రాహుల్ రవీంద్రకు ఈ గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ను ఆది విసిరాడు.

ఇటీవలే.. గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ కార్యక్రమంలో బాలీవుడ్​ సూపర్​స్టార్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, టాలీవుడ్​ కింగ్​ నాగార్జున మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్​ కుమార్​ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఎనలేని స్పందన లభిస్తోంది.

ఇదీ చూడండి:

Green India Challenge: రామోజీ ఫిలిం సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన బిగ్​బీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.