ETV Bharat / city

దారుణం.. కొడుకును చంపి ఇసుక కుప్పలో పూడ్చిపెట్టిన తల్లి - Wanaparthy crime updates

కన్నబిడ్డనే కిరాతకంగా హత్య చేసింది ఓ తల్లి. చంపిన తర్వాత ఇంటి పక్కనే ఉన్న ఇసుక కుప్పలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా రామకృష్ణాపురంలో చోటు చేసుకుంది.

murder
కొడుకును చంపి ఇసుక కుప్పలో పూడ్చిపెట్టిన తల్లి
author img

By

Published : May 23, 2021, 7:36 PM IST

తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో కన్నబిడ్డనే కిరాతకంగా హత్య చేసింది ఓ తల్లి. చంపిన తర్వాత ఇంటి పక్కనే ఉన్న ఇసుక కుప్పలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నాగమ్మ తన కుమారుడైన శివను తల్లి బుచ్చమ్మతో కలిసి కత్తితో పొడిచి, తాడుతో గొంతుకు ఉరివేసి హత్య చేశారు. వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగినా బయటకు పొక్కలేదు. ఆందోళనకు గురైన నాగమ్మ విషయాన్ని సర్పంచ్ లతకు చెప్పగా... ఆమె పోలీసులకు సమాచారం అందించారు.

గ్రామానికి చేరుకున్న పోలీసులు హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. సోమవారం మృతదేహాన్ని బయటకు తీయనున్నారు. హత్యకు గల కారణాలు ఏంటనేది ఇంకా బయటకు రాలేదు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ కిరణ్ కుమార్, సీఐ సీతయ్య, ఎస్ఐ నాగశేఖర రెడ్డి పరిశీలించారు.

తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో కన్నబిడ్డనే కిరాతకంగా హత్య చేసింది ఓ తల్లి. చంపిన తర్వాత ఇంటి పక్కనే ఉన్న ఇసుక కుప్పలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నాగమ్మ తన కుమారుడైన శివను తల్లి బుచ్చమ్మతో కలిసి కత్తితో పొడిచి, తాడుతో గొంతుకు ఉరివేసి హత్య చేశారు. వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగినా బయటకు పొక్కలేదు. ఆందోళనకు గురైన నాగమ్మ విషయాన్ని సర్పంచ్ లతకు చెప్పగా... ఆమె పోలీసులకు సమాచారం అందించారు.

గ్రామానికి చేరుకున్న పోలీసులు హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. సోమవారం మృతదేహాన్ని బయటకు తీయనున్నారు. హత్యకు గల కారణాలు ఏంటనేది ఇంకా బయటకు రాలేదు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ కిరణ్ కుమార్, సీఐ సీతయ్య, ఎస్ఐ నాగశేఖర రెడ్డి పరిశీలించారు.

ఇదీ చూడండి.

100 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసిన స్టార్ సింగర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.