- 'ఆ బాధ్యత ఆరోగ్యమిత్రదే'
కరోనా విస్తరిస్తోన్న దృష్ట్యా ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో తప్పని సరిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పథకాన్ని వర్తింపజేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న ప్రైవేటు ఆస్పత్రులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కౌంటర్ దాఖలుకు ఆదేశం
పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలపై హైకోర్టులో విచారణ జరిగింది. అధికార పార్టీకి చెందిన పత్రికకు 52 శాతం ప్రకటనలు ఇస్తున్నారని సామాజిక కార్యకర్త నాగశ్రవణ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆచరణ సాధ్యం కాదు'
నగదు బదిలీతో ఉచిత విద్యుత్ పథకం ఆచరణ సాధ్యం కాదని రైతు సంఘాల నాయకులు అన్నారు. ఉచిత విద్యుత్ పథకంపై మంత్రివర్గం ఆమోదాన్ని వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- హైకోర్టు స్టే
రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై న్యాయస్థానం స్టే విధించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారత్ ఆర్మీ జిందాబాద్
భారత్కు టిబెట్ మద్దతు పెరుగుతోంది. సరిహద్దులో చైనా దొంగదెబ్బపై టిబెటన్లలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ సిమ్లా నుంచి లద్దాఖ్ వెంబడి వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్దకు గస్తీకి వెళ్తున్న భారత బలగాలకు టిబెటన్లు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఉన్నత స్థాయి సమావేశం!
భారత్, నేపాల్ మధ్య ఈ నెల 17న ఉన్నత స్థాయి అధికారుల భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. రెండు దేశాల ప్రాదేశిక యంత్రాంగాల మధ్య జరగబోతున్న 8వ సమావేశం ఇది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- బీరుట్లో భయంభయం
లెబనాన్ రాజధాని బీరుట్లో జరిగిన భారీ పేలుడు ఘటన మరువకముందే అక్కడి ఓడరేవులో మరో 4 టన్నుల అమోనియం నైట్రేట్ లభ్యమైంది. లెబనాన్ సైన్యం వీటిని స్వాధీనం చేసుకుని పోర్ట్ నుంచి తరలించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సెన్సెక్స్ 634 పాయింట్లు పతనం
స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 634 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 194 పాయింట్ల నష్టంతో 11,400 దిగువకు చేరింది. అంతర్జాతీయ ప్రతికూలతలు శుక్రవారం నష్టాలకు కారణమయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆ జెర్సీ ధరించను'
ప్రస్తుతం ఇంగ్లాండ్లోని ఓ టీ20 లీగ్లో ఆడుతున్నాడు పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్. సోమర్సెట్కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ ఆటగాడు తన జెర్సీపై ఆల్కహాల్ బ్రాండ్ లోగోను ధరించి కనిపించాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆ సినిమాలో మహేశ్ డ్యుయల్ రోల్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.