ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

author img

By

Published : Apr 6, 2021, 10:15 AM IST

తెలంగాణలో రోజురోజుకూ కొవిడ్ పాజిటివ్ రేటు పెరుగుతుంది. 24 గంటల్లో రికార్డుస్థాయి కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 1,498 కరోనా కేసులు నమోదవ్వగా... వైరస్ బారిన పడి ఆరుగురు మృతి చెందారు.

corona cases in telangana
corona virus

కరోనా రెండో దశ తెలంగాణను చుట్టుముట్టేస్తోంది. మొదటి దశ కన్నా వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో మరో 1,498 మంది కొవిడ్ బారిన పడగా.. వైరస్ సోకి ఆరుగురు మృతి చెందారు.

ప్రస్తుతం 10 వేలకు చేరువలో కరోనా క్రియాశీలక కేసులు ఉన్నాయి. 5,323 మంది హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 313 మంది కొవిడ్ బారినపడ్డారు. రాష్ట్రంలో సోమవారం రోజు 62,350 మంది కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,993 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్నా.. చాలా వరకు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలానే కొనసాగితే.. సెకండ్ వేవ్ కరోనాను తెలంగాణ అధిగమించడం కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

కరోనా రెండో దశ తెలంగాణను చుట్టుముట్టేస్తోంది. మొదటి దశ కన్నా వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో మరో 1,498 మంది కొవిడ్ బారిన పడగా.. వైరస్ సోకి ఆరుగురు మృతి చెందారు.

ప్రస్తుతం 10 వేలకు చేరువలో కరోనా క్రియాశీలక కేసులు ఉన్నాయి. 5,323 మంది హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 313 మంది కొవిడ్ బారినపడ్డారు. రాష్ట్రంలో సోమవారం రోజు 62,350 మంది కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,993 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్నా.. చాలా వరకు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలానే కొనసాగితే.. సెకండ్ వేవ్ కరోనాను తెలంగాణ అధిగమించడం కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి:

తిరుపతిలో విమాన మరమ్మతుల కేంద్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.