ETV Bharat / city

Student Died in school: పేపర్​ బాల్​ క్రికెట్​ ప్రాణం తీసింది..

author img

By

Published : Mar 2, 2022, 7:24 PM IST

Student Died in School: తరగతి గదిలో విద్యార్థులు సరదాగా ఆడిన పేపర్​ బాల్​ క్రికెట్​.. ఒకరిని పొట్టనబెట్టుకుంది. నలుగురు విద్యార్థులు ఆడిన ఈ ఆటలో.. చిన్న విషయంలో వివాదం తలెత్తి ఒకరినొకరు కొట్టుకునే వరకు చేరింది. ఈ దాడిలో ఓ విద్యార్థి ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు!

Student Died in school
పేపర్​ బాల్​ క్రికెట్​లో విద్యార్థి మృతి

Student Died in school: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోని కృష్ణానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక బాలుడు మృతిచెందాడు. కృష్ణానగర్​లోని సాయికృప పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు క్లాస్​రూంలో సరదాగా పేపర్‌తో క్రికెట్‌ ఆడుతున్నారు. ఈ క్రమంలో నలుగురు విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. కోపంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఈ ఘర్షణలో మన్సూర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి గమనించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. మన్సూర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Student Died in school: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోని కృష్ణానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక బాలుడు మృతిచెందాడు. కృష్ణానగర్​లోని సాయికృప పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు క్లాస్​రూంలో సరదాగా పేపర్‌తో క్రికెట్‌ ఆడుతున్నారు. ఈ క్రమంలో నలుగురు విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. కోపంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఈ ఘర్షణలో మన్సూర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి గమనించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. మన్సూర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:'కేంద్ర పథకాలను తనవిగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని.. ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.